Team India: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు టీమిండియా జట్టు ఎంపిక‌.. వివ‌రాలు ఇవిగో

TeamIndia squad for NZ Tests

  • ఈ నెల 25 నుంచి రెండు టెస్టుల సిరీస్
  • అజింక్యా ర‌హానే కెప్టెన్ గా, పుజారా వైఎస్ కెప్టెన్ గా టీమిండియా తొలిటెస్టు
  • రెండో టెస్టులో సార‌థిగా కోహ్లీ

టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ నెల 25 నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో బీసీసీఐ భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది. అజింక్యా ర‌హానే కెప్టెన్ గా, పుజారా వైఎస్ కెప్టెన్ గా భార‌త్ తొలి టెస్టు ఆడ‌నున్న‌ట్లు బీసీసీఐ స్ప‌ష్ట‌త‌నిచ్చింది.

కేఎల్ రాహుల్‌, మ‌యాంక్ అగ‌ర్వాల్, శుభ్‌మ‌న్ గిల్, శ్రేయాస్ అయ్య‌ర్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీప‌ర్), కేఎస్ భ‌ర‌త్ (వికెట్ కీప‌ర్), ర‌వీంద్ర జ‌డేజా, ర‌విచంద్ర‌న్ అశ్విన్, అక్షర్ పటేల్, జ‌యంత్ యాద‌వ్, ఇషాంత్ శ‌ర్మ‌, ఉమేశ్ యాద‌వ్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ టీమిండియా స్క్వాడ్ లో ఉన్నారు.

రెండో టెస్టులో కోహ్లీ ఆడ‌తాడ‌ని, జ‌ట్టుకి సార‌థిగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తాడ‌ని బీసీసీఐ ప్ర‌క‌టించింది. టీ20 ప్ర‌పంచ క‌ప్‌లో ఘోరంగా ఓట‌మిపాలై టీమిండియా ఇంటికి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. న్యూజిలాండ్ అద్భుత విజ‌యాలు న‌మోదు చేసుకుని ఫైన‌ల్‌లోకి ప్ర‌వేశించింది.

  • Loading...

More Telugu News