Naveen Patnaik: మదర్ థెరెసా చారిటీకి కేంద్ర సర్కారు చెక్.. ఆదుకున్న ఒడిశా సీఎం 

Naveen Patnaik Steps In After Centres Move On Mother Teresa Charity

  • నిలిచిపోయిన విదేశీ విరాళాలు
  • నిబంధనలను పాటించడం లేదన్న కేంద్రం
  • ఒడిశాలో మిషనరీష్ ఆఫ్ చారిటీకి రూ.78 లక్షల మంజూరు
  • 8 జిల్లాల పరిధిలో సంస్థ సేవలకు సాయానికి సీఎం ఆదేశం

మదర్ థెరెసా స్థాపించిన ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’కి ఆర్థిక సాయం అందించేందుకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ముందుకు వచ్చారు. ఈ సంస్థ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. 1950లో దీన్ని మదర్ థెరెసా కోల్ కతా కేంద్రంగా స్థాపించారు. మిషనరీస్ ఆఫ్ చారిటీకి విదేశాల నుంచి భారీగా విరాళాలు ఏటా వస్తుంటాయి. ఈ నిధులను సేవా కార్యక్రమాలను వినియోగిస్తుంటుంది.

అయితే, భారతీయ చట్టాల ప్రకారం విదేశాల నుంచి విరాళాలు స్వీకరించేందుకు వీలుగా అర్హత నిబంధనలను సంస్థ పాటించడం లేదని కేంద్ర సర్కారు తేల్చింది. దీంతో విదేశాల నుంచి విరాళాలు నిలిచిపోయాయి. ఈ సంస్థ ఒడిశాలో అనాథ శరణాలయాలు, కుష్టు వ్యాధి బాధితుల కేంద్రాలను నిర్వహిస్తోంది. దీంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.78.76 లక్షలను మిషనరీస్ ఆఫ్ చారిటీ నిర్వహణలోని 13 సంస్థలకు మంజూరు చేయాలని సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశించారు.

8 జిల్లాల పరిధిలో నడుస్తున్న 13 సంస్థలకు నిధులు అందేలా చూడాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ఈ సంస్థల పరిధిలో ఆశ్రయం పొందుతున్న ఏ ఒక్కరూ ఇబ్బంది (ఆహారం, ఆరోగ్య పరంగా) పడకుండా చూడాలని కోరారు.  

  • Loading...

More Telugu News