Telangana: తెలంగాణలో కొత్తగా 50 కరోనా కేసులు... తాజా బులెటిన్ ఇదిగో!

Telangana corona media updates

  • గత 24 గంటల్లో 16,128 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 23 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 164 మంది
  • ఇంకా 950 మందికి చికిత్స

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 16,128 కరోనా పరీక్షలు నిర్వహించగా, 50 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 23 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 164 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 

రాష్ట్రంలో ఇప్పటివరకు 7,90,351 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,85,290 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 950 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో కరోనాతో ఇప్పటివరకు 4,111 మంది మరణించారు.
.

  • Loading...

More Telugu News