Telangana: తెలంగాణలో కొత్తగా 36 కరోనా పాజిటివ్ కేసులు

Telangana corona daily media updates

  • గత 24 గంటల్లో 20,379 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 23 మందికి కరోనా పాజిటివ్
  • అనేక జిల్లాల్లో కొత్త కేసులు నిల్
  • కరోనా నుంచి కోలుకున్న 80 మంది
  • ఇంకా 575 మందికి చికిత్స

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 20,379 కరోనా పరీక్షలు నిర్వహించగా, 36 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 23 కొత్త కేసులు నమోదయ్యాయి. అనేక జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 80 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. 

ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 7,91,074 మంది కరోనా బారినపడగా... 7,86,388 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 575 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా వల్ల ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
.

  • Loading...

More Telugu News