Andhra Pradesh: ఏపీలో అత్యంత కనిష్ఠ స్థాయికి కరోనా... తాజా వివరాలు ఇవిగో!

Corona new cases dropped significantly in AP

  • గత 24 గంటల్లో 8,219 కరోనా పరీక్షలు
  • కొత్తగా 5 కేసుల నమోదు 
  • కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఇదే అత్యల్పం!
  • కరోనా నుంచి కోలుకున్న 37 మంది
  • ఇంకా 314 మందికి చికిత్స

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయినట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. గడచిన 24 గంటల్లో 8,219 కరోనా పరీక్షలు నిర్వహించగా, 5 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఇదే అత్యల్పం అనుకోవచ్చు! కృష్ణా జిల్లాలో 2 కేసులు వెల్లడి కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 1, కడప జిల్లాలో 1 కేసు గుర్తించారు. మిగతా జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. 

అదే సమయంలో 37 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. ఏపీలో ఇప్పటివరకు 23,19,509 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,04,465 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 314 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 14,730 మంది మరణించారు.
.

  • Loading...

More Telugu News