Jagan: చిత్తూరు జిల్లాపై ప్రత్యేక అభిమానాన్ని చూపిన జగన్!

Jagan shown special interest on Chittoor Dist

  • కొత్త కేబినెట్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ముగ్గురుకి అవకాశం
  • పాత మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణస్వామిల కొనసాగింపు
  • కొత్తగా రోజాకు అవకాశం కల్పించిన జగన్

ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు అగ్రతాంబూలం లభించింది. ముఖ్యమంత్రి జగన్ చిత్తూరు జిల్లాపై తన ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. కొత్తగా కొలువుదీరనున్న కేబినెట్లో అత్యధిక మంత్రులు ఈ జిల్లాకు చెందిన వారే. పాత మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామిలను కొనసాగించిన ముఖ్యమంత్రి... ఈ విడతలో నగరి ఎమ్మెల్యే రోజాకు కూడా అవకాశం ఇచ్చారు. దీంతో, ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే మంత్రుల సంఖ్య మూడుకు పెరిగింది.

ఈ నేపథ్యంలో జిల్లా వైసీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. స్వీట్లు పంచుతూ, బాణసంచా కాల్చుతూ కార్యకర్తలు హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా పని చేసిన నారాయణస్వామికి ఈసారి కూడా అదే పదవి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News