Deoghar: ముగిసిన దేవ్ గఢ్ రోప్ వే ప్రమాద ఘటన రెస్క్యూ ఆపరేషన్

Deoghar rope way accident rescue operation concluded

  • త్రికూట పర్వతాల వద్ద ప్రమాదం
  • ఢీకొన్న కేబుల్ కార్లు
  • గాల్లోనే 45 గంటల పాటు చిక్కుకుపోయిన ప్రజలు
  • హెలికాప్టర్ల సాయంతో సహాయక చర్యలు

ఝార్ఖండ్ లోని ప్రఖ్యాత పర్యాటక స్థలం త్రికూట పర్వతాల వద్ద రోప్ వే ప్రమాదం సంభవించడం తెలిసిందే. బైద్యనాథ్ ఆలయానికి దారితీసే రోప్ వేలో రెండు కేబుల్ కార్లు ఢీకొనడమే ఈ ప్రమాదానికి కారణం. దాంతో కేబుల్ కార్లలోని ప్రజలు 45 గంటలపాటు గాల్లోనే చిక్కుకుపోయారు. 

కాగా, అధికారులు వాయుసేన సాయం చేపట్టిన సహాయక చర్యలు ముగిశాయి. రెండు ఎంఐ-17 హెలికాప్టర్లు ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాలుపంచుకున్నాయి. 45 మందిని కాపాడగా, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఈ ప్రమాద ఘటనను ఝార్ఖండ్ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ప్రమాదం జరిగిన తీరుపై విచారణకు ఆదేశించింది. ఈ నెల 26న వాదనలు వింటామని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News