India: దేశంలో 15 వేలకు పైగా కరోనా కేసుల నమోదు.. అప్డేట్స్ ఇవిగో!

India records 15528 new COVID19 cases

  • గత 24 గంటల్లో 15,528 కేసుల నమోదు
  • దేశ వ్యాప్తంగా 25 మంది మృతి
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,43,654

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 4.68 లక్షల మందికి కొవిడ్ పరీక్షలను నిర్వహించగా... 15,528 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 16,113 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 25 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 1,43,654 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇక కరోనా కారణంగా ఇప్పటి వరకు 5,25,785 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 3 శాతానికి పైగా ఉంది. క్రియాశీల రేటు 0.33 శాతం, రికవరీ రేటు 98.47 శాతం, మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 2,00,33,55,257 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 27,78,013 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

  • Loading...

More Telugu News