Jammu And Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదుల హతం

2 Hizbul Terrorists Killed In Encounter
  • పోష్క్‌రీరి ప్రాంతంలో ఎదురుకాల్పులు
  • గతేడాది ఓ కానిస్టేబుల్, ఇద్దరు పౌరులను హతమార్చింది వీరే
  • శ్రీనగర్‌లోని ఖాన్‌మోహ్ ప్రాంతంలో పేలుడు పదార్థాల స్వాధీనం
జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు-ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. పోష్క్‌రీరి ప్రాంతంలో ఉగ్రవాదులున్నట్టు సమాచారం అందుకున్న భద్రతా దళాలు నిన్న తనిఖీలు చేపట్టాయి. వారికి తారసపడిన ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. కాల్పులు ఆగిన అనంతరం ఆ ప్రాంతాన్ని పరిశీలించగా ఇద్దరు ఉగ్రవాదులు హతమై కనిపించారు. వారిని హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన డానిష్ భట్ అలియాస్ కొకబ్ దూరీ, బషరత్ నబీగా గుర్తించారు.

వీరిద్దరూ గతంలో పౌరహత్యలకు పాల్పడినట్టు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 2021లో సైనికుడి హత్యతోపాటు ఆ తర్వాతి నెలలో జబ్లీపురాలో ఇద్దరు పౌరుల హత్య కేసులో వీరి ప్రమేయం ఉన్నట్టు పేర్కొన్నారు. మరోవైపు, శ్రీనగర్‌లోని ఖాన్‌మోహ్ ప్రాంతంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 35 కిలోల పేలుడు పదార్థాలు లభించాయి. అనంతరం వాటిని పేలకుండా చేసి ధ్వంసం చేశారు.
Jammu And Kashmir
Encounter
Hizbul Terrorists

More Telugu News