Krishnam Raju: ప్రారంభమైన కృష్ణంరాజు అంతిమయాత్ర

Krishnam Raju final journey begins

  • ఈ మధ్యాహ్నం కృష్ణంరాజు అంత్యక్రియలు
  • ప్రత్యేక వాహనంలో అంతిమయాత్ర
  • మొయినాబాద్ కనకమామిడి ఫాంహౌస్ లో అంత్యక్రియలు
  • ఫాంహౌస్ కి తరలివచ్చిన అభిమానులు   

తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన రెబల్ స్టార్ కృష్ణంరాజు అంతిమయాత్ర ప్రారంభమైంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నివాసం నుంచి వేలాది మంది అభిమానులు తరలి రాగా, కృష్ణంరాజు భౌతికకాయాన్ని ప్రత్యేక వాహనంలో ఉంచారు. ఈ వాహనం మొయినాబాద్ లోని కనకమామిడి ఫాంహౌస్ కు చేరుకోనుంది. అక్కడ అధికారిక లాంఛనాలతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

అటు, కనకమామిడి ఫాంహౌస్ లోని బ్రౌన్ టౌన్ రిసార్ట్ వద్ద కృష్ణంరాజు అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ప్రాంతానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరించారు.

అంతకుముందు, జూబ్లీహిల్స్ లో కృష్ణంరాజు పార్థివదేహాన్ని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సందర్శించారు. ఆయనకు కడసారి వీడ్కోలు పలికారు.

  • Loading...

More Telugu News