Team India: వచ్చే ఏడాది ఆసియా కప్ కోసం భారత జట్టు పాకిస్థాన్ వెళ్లదు: జై షా

Jay Shah clarifies India wont be travel to Pakistan for Asia Cup

  • సుదీర్ఘకాలంగా పాక్ తో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడని భారత్
  • పాక్ లో పర్యటించేందుకు భారత్ విముఖత
  • రాజకీయ అంశాలే కారణం
  • 2023 ఆసియా కప్ తటస్థ వేదికపై జరిగే అవకాశముందున్న షా

రాజకీయ కారణాలతో భారత జట్టు ఒకటిన్నర దశాబ్ద కాలంగా పాకిస్థాన్ లో పర్యటించడం మానుకుంది. అయితే, వచ్చే ఏడాది ఆసియా కప్ కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ టోర్నీ కోసం భారత జట్టు పాకిస్థాన్ వెళ్లబోవడంలేదని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. ఆసియా స్థాయిలో ఇది ప్రధాన టోర్నీ అయినందున టీమిండియా తప్పక ఆడాల్సి ఉంటుందని, అందుకే ఈ టోర్నీని తటస్థ వేదికలో నిర్వహించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. 

భారత్ చివరిసారిగా 2008లో పాకిస్థాన్ లో పర్యటించింది. అప్పట్లో ఆసియా కప్ టోర్నీని వన్డే ఫార్మాట్ లో నిర్వహించగా, ఆ టోర్నీలో భారత్ పాల్గొంది. ఈ టోర్నీలో శ్రీలంక విజేత కాగా, భారత్ రన్నరప్ గా నిలిచింది.

  • Loading...

More Telugu News