Andhra Pradesh: అమరావతి రైతుల పాదయాత్ర సాఫీగా సాగేందుకు తీసుకున్న చర్యలేమిటో చెప్పండి: హైకోర్టు
![ap high court issues notices to amaravati farmers and ap police](https://imgd.ap7am.com/thumbnail/cr-20221020tn6351278f3b771.jpg)
- యాత్రకు అడ్డంకులు కలుగుతున్నాయంటూ హైకోర్టును ఆశ్రయించిన రైతులు
- రైతుల పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు
- పోలీసులు, రైతులకు నోటీసుల జారీ
- తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా
ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు చేపట్టిన అమరావతి టూ అరసవెల్లి మహాపాదయాత్ర సాఫీగా సాగేందుకు తీసుకున్న చర్యలేమిటో చెప్పాలంటూ పోలీసులు, అమరావతి రైతులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు తమ యాత్రకు అడ్డంకులు ఎదురు కాకుండా చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలంటూ రైతులు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు గురువారం మధ్యాహ్నం విచారణ చేపట్టింది.