Pawan Kalyan: ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నుదన్ను: టీడీపీ కార్యకర్తల మృతిపై పవన్ తీవ్ర విచారం

Pawan Kalyan says he pained with deaths of TDP workers

  • చంద్రబాబు సభలో తొక్కిసలాటలో 8 మంది మృతి
  • చాలా దురదృష్టకరమన్న పవన్ కల్యాణ్
  • గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు చంద్రబాబు రోడ్ షోలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఎనిమిది మంది టీడీపీ కార్యకర్తలు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరులో తెలుగుదేశం పార్టీ సభ జరుగుతుండగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో 8 మంది మృతి చెందడం, మరికొందరు ఆసుపత్రిపాలు కావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

 ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నుదన్ను అని... అటువంటి కార్యకర్తలు ఇలా ప్రమాదం బారినపడి మృతి చెందడం ఎంతో విచారకరమని చెప్పారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. ఆసుపత్రిపాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు.

  • Loading...

More Telugu News