Jagan: గవర్నర్ దంపతులను కలిసిన జగన్ దంపతులు

Jagan meets Governor Harichandan

  • ఛత్తీస్ గఢ్ కు బదిలీ అయిన గవర్నర్ బిశ్వభూషణ్
  • మూడున్నరేళ్ల పాటు ఏపీకి సేవలు
  • రాజ్ భవన్ కు వెళ్లిన జగన్, భారతి

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఛత్తీస్ గఢ్ కు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ దంపతులను ముఖ్యమంత్రి జగన్, ఆయన భార్య భారతి మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి శ్రీవేంకటేశ్వరస్వామి వారి ప్రతిమను బహూకరించారు. 

ఈ సందర్భంగా గవర్నర్, ముఖ్యమంత్రి ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. మూడున్నరేళ్ల పాటు ఏపీకి గవర్నర్ గా సేవలందించినందుకు జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీకి కొత్త గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ నియమితులైన సంగతి తెలిసిందే.  


  • Loading...

More Telugu News