Jagan: అమరావతిలో 50 వేలకు పైగా ఇళ్ల నిర్మాణాలకు నేడు శంకుస్థాపన చేయనున్న జగన్

Jagan to lay foundation stone for houses in Amaravati

  • మే 26న పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం
  • 1,402 ఎకరాల్లో 25 లేఅవుట్లలో 50,793 ఇళ్ల నిర్మాణం
  • రూ. 1,371.41 కోట్ల ఖరీదైన భూమిలో పేదలకు ఇళ్లు

మరో భారీ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టబోతున్నారు. అమరావతిలో 50 వేలకు పైగా ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయబోతున్నారు. నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్డీఏలో ఈ రోజు భూమి పూజను నిర్వహించనున్నారు. సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాల్లో 25 లేఅవుట్ లలో 50,793 మందికి మే 26న ఇళ్ల పట్టాలను అందించిన సంగతి తెలిసిందే. మొత్తం రూ. 1,371.41 కోట్ల ఖరీదైన భూమిని పేదలకు పంపిణీ చేశారు. ఈ భూమిలో ఇప్పుడు ఇళ్ల నిర్మాణాలను చేపట్టబోతున్నారు.

  • Loading...

More Telugu News