AP Govt: అంగళ్లు, పుంగనూరు ఘటనలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

AP Govt approach supreme court on high court verdict

  • ఇటీవల చంద్రబాబు పర్యటన సందర్భంగా ఉద్రిక్త ఘటనలు
  • టీడీపీ నేతలపై కేసులు
  • ఒక్క చల్లా బాబుపైనే 7 కేసులు
  • టీడీపీ నేతలకు ముందస్తు బెయిల్ ఇచ్చిన హైకోర్టు
  • హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేసిన ఏపీ సర్కారు

ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా అన్నమయ్య జిల్లా అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్త ఘటనలు చోటుచేసుకోవడం తెలిసిందే. ఈ కేసులో టీడీపీ నేతలు దేవినేని ఉమ, నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, చల్లా బాబు, పులివర్తి నానిలకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 

ఒక్క చల్లా బాబుపైనే 7 కేసులు పెట్టగా, నాలుగు కేసుల్లో  బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. టీడీపీ నేతలకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది.

  • Loading...

More Telugu News