Ganesh idols: వినాయక నిమజ్జనాలకు హైకోర్టు కీలక సూచన

Ban on PoP Ganesh idols immersion in Hussain Sagar
  • ట్యాంక్ బండ్ పై పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని ఆదేశం
  • కృత్రిమ కొలనుల్లోనే చేయాలని స్పష్టం చేసిన హైకోర్టు
  • గతంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ప్రభుత్వానికి సూచన
జంటనగరాల్లో వినాయక నిమజ్జనానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ట్యాంక్ బండ్ పై పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని స్పష్టం చేసింది. ఈ విషయంలో గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. పీవోపీ విగ్రహాల నిమజ్జనానికి కృత్రిమ కొలనులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చూడాలని, పీవోపీ విగ్రహాల నిమజ్జనం విషయంలో తగు చర్యలు తీసుకోవాలని సీపీకి సూచించింది. ఈ ఏర్పాట్లకు సంబంధించి, అమలు చేసిన విధానానికి సంబంధించి కోర్టుకు నివేదిక సమర్పించాలని పేర్కొంది. జంటనగరాల్లోని పీవోపీ విగ్రహాలను ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొలనుల్లోనే చేయాలని హైకోర్టు మరోమారు స్పష్టం చేసింది.
Ganesh idols
immersion
Hussain Sagar
PoP idols
Telangana Highcourt

More Telugu News