Vishnu Vardhan Reddy: ఏపీలో ఆ రెండు పార్టీలకు అవకాశం ఇచ్చారు... ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలుసు: విష్ణువర్ధన్ రెడ్డి

Vishnu Vardhan Reddy appeals for one chance to BJP in AP

  • శ్రీ సత్యసాయి జిల్లా బీజేపీ బూత్ లెవల్ నేతలతో పార్టీ అగ్రనేతల సమావేశం
  • హాజరైన పురందేశ్వరి, విష్ణువర్ధన్ రెడ్డి
  • టీడీపీ, వైసీపీలపై విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు
  • ఏపీలో బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి

శ్రీ సత్యసాయి జిల్లా బీజేపీ బూత్ లెవల్ అధ్యక్షులతో పార్టీ అగ్రనేతలు సమావేశమయ్యారు. ఈ సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. 

ఈ సమావేశం అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి సోషల్ మీడియాలో స్పందించారు. ఏపీలో ఐదేళ్లు తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారని, వైసీపీకి నాలుగున్నరేళ్లుగా అవకాశం ఇచ్చారని, ఈ రెండు పార్టీల వల్ల రాష్ట్ర పరిస్థితి నేడు ఎలా తయారైందో ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. ఈ రెండు పార్టీల నేతలు తమ వర్గ, వ్యక్తిగత కక్షపూరిత రాజకీయాలతో గత పదేళ్లుగా కేసులు, జైళ్లు, బెయిళ్లతో పాలన చేశారని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. ఈ పరిస్థితుల్లో బీజేపీకి కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంటే డబుల్ ఇంజిన్ సర్కారుతో రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News