revuri prakash reddy: ఆర్టీసీ బస్సును నడిపిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

MLA Revuri Prakash Reddy drives RTC bus
  • పరకాలలో కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన రేవూరి
  • పరకాల డిపోకు 20 కొత్త బస్సులను కేటాయించినట్లు వెల్లడి
  • ఆరు గ్యారెంటీలలో భాగంగా ఆడపడుచులకు ఉచిత బస్సు హామీని నెరవేర్చామని వెల్లడి
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆర్టీసీ బస్సును నడిపారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన ఆర్టీసీ బస్సులను హన్మకొండ జిల్లా పరకాలలో రేవూరి ప్రారంభించారు. ఈ సమయంలో ఆయన సరదాగా బస్సును నడిపారు. పరకాల డిపోకు 20 కొత్త బస్సులను కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆరు గ్యారెంటీలలో భాగంగా ఆడపడుచులకు ఇచ్చిన ఉచిత బస్సు హామీని నెరవేర్చామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1400 కొత్త బస్సులు వచ్చాయన్నారు. ఇందులో పరకాల డిపోకు ఇరవై బస్సులు వచ్చాయన్నారు.
revuri prakash reddy
Telangana
Congress
rtc bus

More Telugu News