Mahesh Babu: శ్రీమంతుడు వివాదం: మహేశ్ బాబుపై సుప్రీంకోర్టులో కేసు వేస్తానంటున్న శరత్ చంద్ర

Will file a case on Mahesh Babu says writer Sarath Chandra
  • తన కథను కాపీ కొట్టి శ్రీమంతుడు చిత్రాన్ని తీశారంటున్న రచయిత శరత్ చంద్ర
  • కొరటాల శివ క్రిమినల్ విచారణను ఎదుర్కోవాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు
  • మహేశ్ బాబు, మైత్రి మూవీ మేకర్స్ పై కేసు వేసేందుకు సిద్ధమవుతున్న శరత్ చంద్ర
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'శ్రీమంతుడు' సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అన్ని రకాల ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించారు. ఈ చిత్రంలో మహేశ్ సరసన శ్రుతిహాసన్ నటించింది. అయితే, ఈ చిత్రం ఇప్పడు వివాదంలో కూరుకుపోయింది. తాను రచించిన 'చచ్చేంత ప్రేమ' అనే నవల నుంచి ఈ సినిమా కథను మక్కీకి మక్కీ దించేశారని రచయిన శరత్ చంద్ర కోర్టుకెక్కారు. సుప్రీంకోర్టు సైతం కొరటాల శివ క్రిమినల్ విచారణను ఎదుర్కోవాల్సిందేనని ఆదేశాలను జారీ చేసింది. 

ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ తో పాటు మహేశ్ బాబు కూడా నిర్మాతగా వ్యవహరించారు. దీంతో ఇప్పుడు ఈ వివాదం మహేశ్ మెడకు కూడా చుట్టుకునేలా ఉంది. రచయిత శరత్ చంద్ర మహేశ్ బాబు, మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ పై కోర్టులో కేసు వేసేందుకు సిద్ధమవుతున్నారు. 

ఈ సందర్భంగా శరత్ చంద్ర మాట్లాడుతూ... గతంలోనే తాను మహేశ్ బాబుకు నోటీసులు పంపానని... అయినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదని చెప్పారు. మహేశ్ పై సుప్రీంకోర్టుకు వెళ్తానని హెచ్చరించారు.
Mahesh Babu
Koratala Siva
Srimanthudu Movie
Tollywood
Sarath Chandra
Copyright

More Telugu News