Namrata Shirodkar: శంకర్‌పల్లి తహసీల్దార్ కార్యాలయానికి మహేశ్‌బాబు భార్య నమ్రత

Mahesh Babu Wife Namrata Shirodkar Visits Shankarpally MRO Office

  • గోపులారం గ్రామంలో ఇటీవల రెండెకరాల భూమిని కొనుగోలు చేసిన నమ్రత
  • రిజిస్ట్రేషన్ నిమిత్తం కార్యాలయానికి
  • గుర్తుపట్టి సందడి చేసిన మహేశ్ ఫ్యాన్స్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు భార్య నమ్రత శిరోద్కర్  రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలోని గోపులారం గ్రామంలో ఇటీవల రెండెకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో భూమి రిజిస్ట్రేషన్ పనుల కోసం నిన్న శంకర్‌పల్లి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. రిజిస్ట్రేషన్ కోసం ఆమె చాలా సేపు అక్కడే ఉండాల్సి వచ్చింది.

ఈ క్రమంలో ఆమెను గుర్తించిన మహేశ్ అభిమానులు నమ్రతను చుట్టుముట్టి సందడి చేశారు. ఆమెతో ఫొటోలు దిగేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. దీంతో ఒక్కసారిగా కార్యాలయంలో హడావుడి కనిపించింది. నమ్రత ఏమాత్రం విసుగు చెందకుండా అందరితో ఫొటోలు దిగారు.

  • Loading...

More Telugu News