Chandrababu: జయప్రకాశ్ నారాయణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: చంద్రబాబు

Chandrababu welcomes Jayaprakash Narayan decision to support NDA alliance in AP
  • ఏపీలో ఎన్డీయే కూటమికి మద్దతు పలికిన జేపీ
  • హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు
  • ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని వెల్లడి
  • భావసారూప్యత ఉన్నవారందరూ కలిసి రావాలని విజ్ఞప్తి
ఏపీ ఎన్నికల్లో తాము టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి మద్దతు పలుకుతున్నామని లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ప్రకటించడం తెలిసిందే. దీనిపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు. 

ప్రగతిశీల, ప్రజాస్వామ్య ఆంధ్రప్రదేశ్ కోసం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వాలన్న జయప్రకాశ్ నారాయణ గారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యం తీవ్రమైన ముప్పు ఎదుర్కొంటోందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి భావసారూప్యత కలిగిన అందరు వ్యక్తులు, సంస్థలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పిలుపునిచ్చారు.
Chandrababu
Jayaprakash Narayan
Loksatta
TDP-JanaSena-BJP Alliance
NDA
Andhra Pradesh

More Telugu News