Telangana High Court: అతడికి మరణశిక్షే సరైనది... తెలంగాణ హైకోర్టు తీర్పు

Telangana high court uphold sessions court verdict on migrant worker death sentence

  • 2017లో హైదరాబాద్ లో చిన్నారిపై హత్యాచారం
  • ఓ సెంట్రింగ్ కూలీ ఘాతుకం
  • మరణశిక్ష విధించిన సెషన్స్ కోర్టు
  • తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసిన వైనం
  • పిటిషన్ ను తోసిపుచ్చిన హైకోర్టు

హైదరాబాదులోని నార్సింగిలో ఐదేళ్ల పాపపై అత్యాచారం చేసి హత్య చేసిన వ్యక్తికి మరణశిక్షే సరైనదని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు దోషికి కింది కోర్టు విధించిన మరణశిక్షను తెలంగాణ హైకోర్టు సమర్థించింది. 

2017లో మధ్యప్రదేశ్ కు చెందిన దినేశ్ కుమార్ ధర్నే అనే వలస కూలీ హైదరాబాదులో ఒక చిన్నారిపై దారుణానికి ఒడిగట్టాడు. చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపి ఆ చిన్నారిని కిడ్నాప్ చేశాడు. పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసిన అనంతరం, ఆ విషయం తల్లిదండ్రులకు చెబుతుందేమోనని భయపడి ఆ పాపను హత్య చేశాడు. ఆ పాప తల్లిదండ్రులు బీహార్ నుంచి హైదరాబాద్ కు వలస వచ్చారు. 

ఈ కేసు విచారణ చేపట్టిన రంగారెడ్డి జిల్లా మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు దినేశ్ కుమార్ కు 2021లో ఉరిశిక్ష విధించింది. ఆ తీర్పును దినేశ్ కుమార్ తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశాడు. అయితే తెలంగాణ హైకోర్టు అతడి విజ్ఞప్తిని తోసిపుచ్చి, మరణశిక్షను ఖరారు చేసింది.

  • Loading...

More Telugu News