IIT Madras: గోమూత్రం ఔషధం.. తాగితే జ్వరం తగ్గుతుంది: ఐఐటీ మద్రాస్ డైరెక్టర్

--
గోమూత్రం అతిపెద్ద ఔషధమని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్, ప్రొఫెసర్ వి కామకోటి పేర్కొన్నారు. మన శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియాతో పోరాడే శక్తి గోమూత్రానికి ఉందన్నారు. గోమూత్రం సేవిస్తే జ్వరం తగ్గుతుందని చెప్పారు. ఈమేరకు చెన్నైలో జరిగిన ఓ పూజా కార్యక్రమంలో కామకోటి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రొఫెసర్ కామకోటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నెల 15న కనుమ పండుగ సందర్భంగా వెస్ట్ మాంబళంలోని ఓ గోశాలలో నిర్వాహకులు పూజలు చేశారు. ఈ పూజలకు ప్రొఫెసర్ కామకోటి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కామకోటి మాట్లాడుతూ.. ఓసారి తన తండ్రికి జ్వరం వస్తే ఓ సన్యాసిని ఆశ్రయించారని, వైద్యుడి వద్దకు వెళ్లే విషయంపై ఆయన సలహా అడిగారని చెప్పారు. జ్వరానికి వైద్యుడి వద్దకు వెళ్లాల్సిన అవసరంలేదని చెబుతూ గోమూత్రం తాగాలని ఆ సన్యాసి సూచించారని వివరించారు. తన తండ్రి గోమూత్రం సేవించిన పదిహేను నిమిషాల్లోనే జ్వరం తగ్గిందని ప్రొఫెసర్ కామకోటి తెలిపారు. గోమూత్రంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని, మన శరీరంలోని చెడు బ్యాక్టీరియాను అవి అంతం చేస్తాయని ప్రొఫెసర్ కామకోటి వివరించారు.
ఈ సందర్భంగా కామకోటి మాట్లాడుతూ.. ఓసారి తన తండ్రికి జ్వరం వస్తే ఓ సన్యాసిని ఆశ్రయించారని, వైద్యుడి వద్దకు వెళ్లే విషయంపై ఆయన సలహా అడిగారని చెప్పారు. జ్వరానికి వైద్యుడి వద్దకు వెళ్లాల్సిన అవసరంలేదని చెబుతూ గోమూత్రం తాగాలని ఆ సన్యాసి సూచించారని వివరించారు. తన తండ్రి గోమూత్రం సేవించిన పదిహేను నిమిషాల్లోనే జ్వరం తగ్గిందని ప్రొఫెసర్ కామకోటి తెలిపారు. గోమూత్రంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని, మన శరీరంలోని చెడు బ్యాక్టీరియాను అవి అంతం చేస్తాయని ప్రొఫెసర్ కామకోటి వివరించారు.