Penna Pratap Reddy: ఒంటిమిట్ట సీతారామలక్ష్మణులకు బంగారు కిరీటాలు బహూకరించిన పెన్నా సిమెంట్స్ అధినేత

Penna Cements Head Donates Rs 66 Crore Golden Crowns to Ontimitta Temple
  • ఒంటిమిట్ట రామాలయానికి విలువైన కానుకలు
  • కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన పెన్నా ప్రతాపరెడ్డి
  • స్వర్ణ కిరీటాల విలువరూ.6.60 కోట్లు 
పెన్నా సిమెంట్స్ అధినేత పెన్నా ప్రతాపరెడ్డి ఒంటిమిట్ట రామాలయానికి విలువైన కానుకలు సమర్పించారు. ఒంటిమిట్ట సీతారామలక్ష్మణులకు మూడు బంగారు కిరీటాలు బహూకరించారు. వజ్రాలు పొదిగిన ఆ స్వర్ణ కిరీటాల విలువ రూ.6.60 కోట్లు. 

ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి ఒంటిమిట్ట రామాలయానికి విచ్చేసిన పెన్నా ప్రతాపరెడ్డి ఆ స్వర్ణ కిరీటాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, తిరుమల ఆలయ ఈవో జె.శ్యామలరావులకు అందజేశారు. ఈ సందర్భంగా ఒంటిమిట్ట రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ పసిడి కిరీటాలను సీతారామలక్ష్మణులకు అలంకరించారు.
Penna Pratap Reddy
Penna Cements
Ontimitta Rama Temple
Golden Crowns
Diamond-studded Crowns
Tirumala Tirupati Devasthanams (TTD)
B.R. Naidu
J. Shyamala Rao
Andhra Pradesh
Temple Donation

More Telugu News