Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబుకు సీపీఐ నేత లేఖ

CPI Leader Writes to AP CM Chandrababu Naidu Regarding Mega DSP Notification
  • మెగా డీఎస్పీ నోటిఫికేషన్ పై హర్షం
  • వయోపరిమితి పెంచాలని అభ్యర్థన
  • వేగంగా పూర్తిచేయాలని కోరిన సీపీఐ నేత
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ హర్షణీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి  కె. రామకృష్ణ పేర్కొన్నారు. అయితే, ఈ నోటిఫికేషన్ కు సంబంధించి అభ్యర్థుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వయోపరిమితిపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని, వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని కోరారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సోమవారం రామకృష్ణ లేఖ రాశారు.

2018 తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదని రామకృష్ణ తన లేఖలో గుర్తుచేశారు. అప్పటి నుంచి డీఎస్సీ నోటిఫికేషన్ కోసం చాలామంది అభ్యర్థులు వేచి చూస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో అభ్యర్థుల్లో వయోపరిమితిపై ఆందోళన నెలకొందని చెప్పారు. వయోపరిమితి 47 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకోవాలని, మెగా డీఎస్సీ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని రామకృష్ణ తన లేఖలో సీఎం చంద్రబాబును కోరారు.
Chandrababu Naidu
CPI
K Ramakrishna
Mega DSP Notification
Andhra Pradesh
Age Limit
DSC Notification
AP Government
Recruitment
Government Jobs

More Telugu News