Chain Snatching: మంగళసూత్రం లాక్కెళుతుంటే వెంటాడి పట్టుకున్న దంపతులు.. కీసరలో ఘటన

--
కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చైన్ స్నాచింగ్ ఘటన జరిగింది. బైక్ పై వెళుతున్న భార్యాభర్తలను వెంటాడిన ఓ దొంగ.. నిర్మానుష్య ప్రాంతానికి చేరుకోగానే ఆ మహిళ మెడలోని మంగళసూత్రాన్ని లాక్కెళ్లాడు. వెంటనే తేరుకున్న ఆ మహిళ భర్త తన బైక్ తో దొంగను ఛేజ్ చేశాడు. కీసరలో స్థానికుల సాయంతో ఆ దొంగను పట్టుకుని చితకబాదాడు. ఆపై స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అప్పగించాడు.
కీసర నుంచి యాదగిరిపల్లెకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుందని బాధితురాలు చింతల పద్మ తెలిపారు. భర్తతో కలిసి బైక్ పై వెళుతుంటే వెనక నుంచి వచ్చిన దొంగ తన మెడలోని 4 తులాల మంగళసూత్రాన్ని లాక్కెళ్లాడని చెప్పారు. పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
కీసర నుంచి యాదగిరిపల్లెకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుందని బాధితురాలు చింతల పద్మ తెలిపారు. భర్తతో కలిసి బైక్ పై వెళుతుంటే వెనక నుంచి వచ్చిన దొంగ తన మెడలోని 4 తులాల మంగళసూత్రాన్ని లాక్కెళ్లాడని చెప్పారు. పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.