Shashi Tharoor: నేను ప్రభుత్వానికి అనుకూలంగా కాదు.. ప్రతిపక్షానికి పనిచేస్తున్నాను.. శశిథరూర్ స్పష్టీకరణ

- ‘ఆపరేషన్ సిందూర్’ బృందానికి శశి థరూర్ సారథ్యం
- పాకిస్థాన్ను దెబ్బకొట్టాలని తానే వ్యాసం రాశానన్న థరూర్
- భారత్ సరిగ్గా అదే చేసినందుకు సంతోషంగా ఉంది
- తమకు యుద్ధం కంటే ఆర్థిక ప్రగతే ముఖ్యమన్న కాంగ్రెస్ నేత
- ఐదు దేశాల పర్యటనలో పార్లమెంటరీ బృందం
తాను ప్రభుత్వంలో లేనని, ప్రభుత్వానికి పనిచేయబోనని, ప్రతిపక్షానికి చెందిన వాడినని, కాబట్టి ప్రతిపక్షానికే పనిచేస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ తేల్చి చెప్పారు. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఒక పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి థరూర్ నాయకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ బృందం న్యూయార్క్లో పర్యటిస్తోంది.
ఈ సందర్భంగా న్యూయార్క్లోని భారత కాన్సులేట్లో జరిగిన ఒక సమావేశంలో శశిథరూర్ మాట్లాడుతూ "మీకు తెలిసినట్లుగా నేను ప్రభుత్వంలో లేను, ప్రతిపక్ష పార్టీకి చెందినవాడిని. అయినా, పాకిస్థాన్పై సరైన సమయంలో బలంగా, తెలివిగా దెబ్బకొట్టాలని నేనే ఒక వ్యాసం రాశాను. ఇప్పుడు భారత్ సరిగ్గా అదే చేసిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను" అన్నారు. మే 7వ తేదీన భారత్ ‘చాలా కచ్చితమైన, ప్రణాళికాబద్ధమైన దాడులు’ చేసిందని, పాకిస్థాన్, పీవోకేలోని ‘తొమ్మిది నిర్దిష్ట ఉగ్రవాద స్థావరాలు, వాటి ప్రధాన కార్యాలయాలు, లాంచ్ప్యాడ్లను’ లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసిందని ఆయన వివరించారు.
ఐదు దేశాల్లో పర్యటన
శశిథరూర్ నాయకత్వంలోని ఈ పార్లమెంటరీ ప్రతినిధి బృందం అమెరికా, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియాతో సహా ఐదు దేశాల్లో పర్యటించనుంది. ఈ బృందంలో బీజేపీ ఎంపీలు తేజస్వి సూర్య, భువనేశ్వర్ కలిత, శశాంక్ మణి త్రిపాఠి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కి చెందిన శాంభవి చౌదరి, తెలుగుదేశం పార్టీకి చెందిన జి.ఎం. హరీశ్ బాలయోగి, శివసేనకు చెందిన మిలింద్ దేవరా, జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన సర్ఫరాజ్ అహ్మద్, అమెరికాలో భారత మాజీ రాయబారి తరంజిత్ సింగ్ సంధు కూడా సభ్యులుగా ఉన్నారు.
ఈ సందర్భంగా న్యూయార్క్లోని భారత కాన్సులేట్లో జరిగిన ఒక సమావేశంలో శశిథరూర్ మాట్లాడుతూ "మీకు తెలిసినట్లుగా నేను ప్రభుత్వంలో లేను, ప్రతిపక్ష పార్టీకి చెందినవాడిని. అయినా, పాకిస్థాన్పై సరైన సమయంలో బలంగా, తెలివిగా దెబ్బకొట్టాలని నేనే ఒక వ్యాసం రాశాను. ఇప్పుడు భారత్ సరిగ్గా అదే చేసిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను" అన్నారు. మే 7వ తేదీన భారత్ ‘చాలా కచ్చితమైన, ప్రణాళికాబద్ధమైన దాడులు’ చేసిందని, పాకిస్థాన్, పీవోకేలోని ‘తొమ్మిది నిర్దిష్ట ఉగ్రవాద స్థావరాలు, వాటి ప్రధాన కార్యాలయాలు, లాంచ్ప్యాడ్లను’ లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసిందని ఆయన వివరించారు.
ఐదు దేశాల్లో పర్యటన
శశిథరూర్ నాయకత్వంలోని ఈ పార్లమెంటరీ ప్రతినిధి బృందం అమెరికా, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియాతో సహా ఐదు దేశాల్లో పర్యటించనుంది. ఈ బృందంలో బీజేపీ ఎంపీలు తేజస్వి సూర్య, భువనేశ్వర్ కలిత, శశాంక్ మణి త్రిపాఠి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కి చెందిన శాంభవి చౌదరి, తెలుగుదేశం పార్టీకి చెందిన జి.ఎం. హరీశ్ బాలయోగి, శివసేనకు చెందిన మిలింద్ దేవరా, జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన సర్ఫరాజ్ అహ్మద్, అమెరికాలో భారత మాజీ రాయబారి తరంజిత్ సింగ్ సంధు కూడా సభ్యులుగా ఉన్నారు.