Nandigam Suresh: నందిగం సురేశ్ ను మూడు రోజుల కస్టడీకి తీసుకున్న తుళ్లూరు పోలీసులు

- ఇసుకపల్లి రాజు కేసులో మాజీ ఎంపీ నందిగం సురేశ్ విచారణ
- సురేశ్ ను పోలీసు కస్టడీకి ఇచ్చిన మంగళగిరి కోర్టు
- గుంటూరు సబ్ జైలు నుంచి తుళ్లూరు పీఎస్కు నందిగం సురేశ్
టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను పోలీసులు ఈరోజు కస్టడీలోకి తీసుకున్నారు. మంగళగిరి కోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం, తుళ్లూరు పోలీసులు ఆయనను మూడు రోజుల పాటు తమ కస్టడీలో ఉంచుకుని విచారించనున్నారు.
గుంటూరు జిల్లా సబ్ జైలులో రిమాండులో ఉన్న నందిగం సురేశ్ ను విచారణ నిమిత్తం తుళ్లూరు పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను తుళ్లూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. రాబోయే మూడు రోజుల పాటు లోతుగా ప్రశ్నించి, ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు.
నందిగం సురేశ్ ను మే 18వ తేదీ సాయంత్రం తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేసి, మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం, న్యాయమూర్తి ఆయనకు జూన్ 2వ తేదీ వరకు రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు ఆయన్ను గుంటూరు సబ్ జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా, గతంలో ఓ మహిళ హత్య కేసులో నందిగం సురేశ్ మూడు నెలల పాటు జైలు జీవితం గడిపారు. ఇటీవలే ఆయన ఆ కేసులో బెయిల్పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
గుంటూరు జిల్లా సబ్ జైలులో రిమాండులో ఉన్న నందిగం సురేశ్ ను విచారణ నిమిత్తం తుళ్లూరు పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను తుళ్లూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. రాబోయే మూడు రోజుల పాటు లోతుగా ప్రశ్నించి, ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు.
నందిగం సురేశ్ ను మే 18వ తేదీ సాయంత్రం తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేసి, మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం, న్యాయమూర్తి ఆయనకు జూన్ 2వ తేదీ వరకు రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు ఆయన్ను గుంటూరు సబ్ జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా, గతంలో ఓ మహిళ హత్య కేసులో నందిగం సురేశ్ మూడు నెలల పాటు జైలు జీవితం గడిపారు. ఇటీవలే ఆయన ఆ కేసులో బెయిల్పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే.