Jagan Mohan Reddy: తెనాలి ఘటన: పోలీసుల తీరుపై జగన్ సంచలన ఆరోపణలు

- తెనాలిలో యువకులపై పోలీసుల అమానుషంగా దాడి చేశారన్న జగన్
- ఏప్రిల్ 24న వివాదం, తర్వాత రోజుల తరబడి చిత్రహింసలు పెట్టారని ఆరోపణ
- గాయాలున్నా... లేవని డాక్టర్లతో సర్టిఫికెట్ ఇప్పించారని ఆగ్రహం
- ఘటన తర్వాత రౌడీషీట్లు తెరిచి, తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగన్ ఫైర్
- పోలీసులే చిత్రీకరించిన వీడియో నెల తర్వాత బయటకు వచ్చిందని వెల్లడి
తెనాలిలో ఇటీవల జరిగిన ఓ ఘటనపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ముగ్గురు యువకులపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని, వారిపై అక్రమ కేసులు బనాయించి, చిత్రహింసలకు గురిచేశారని ఆయన మండిపడ్డారు. ఇవాళ తెనాలిలో యువకుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి పలు సంచలన ఆరోపణలను మీడియా ముందుంచారు. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వ్యవహరించారంటూ ధ్వజమెత్తారు.
జగన్ ఏం చెప్పారంటే...!
వైఎస్ జగన్ వెల్లడించిన వివరాల ప్రకారం, తెనాలికి చెందిన రాకేష్ (జొమాటో ఉద్యోగి, హైదరాబాద్లో పనిచేస్తాడు), మంగళగిరికి చెందిన షేబ్రోల్ జాన్ విక్టర్ (జూనియర్ అడ్వకేట్), కరీముల్లా (మెకానిక్) అనే ముగ్గురు యువకులు ఈ ఘటనలో బాధితులుగా ఉన్నారు. వీరు దళిత, మైనారిటీ వర్గాలకు చెందినవారని, అణగారిన వర్గాల యువకులని జగన్ పేర్కొన్నారు.
ఏప్రిల్ 24న తెనాలిలోని ఐతానగర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఓ కానిస్టేబుల్ సివిల్ డ్రెస్సులో ఎవరితోనో గొడవపడుతుండగా, ఈ యువకులు జోక్యం చేసుకుని, "మా ఏరియాకు వచ్చి ఎందుకు గొడవ చేస్తున్నారు?" అని ప్రశ్నించారని జగన్ తెలిపారు. ఇదే వారు చేసిన తప్పయిందని ఆయన అన్నారు. ఆ కానిస్టేబుల్ జాన్ విక్టర్ బైక్ తాళాలు, ఫోన్ లాక్కున్నాడని, వారు వాటిని తిరిగి తీసుకున్న తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోయారని వివరించారు.
అయితే, మరుసటి రోజు ఏప్రిల్ 25న, సదరు కానిస్టేబుల్ మరికొందరు పోలీసులతో కలిసి మంగళగిరి వెళ్లి జాన్ విక్టర్, కరీముల్లాలను కొట్టుకుంటూ తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారని జగన్ ఆరోపించారు. ఆ రోజు రాత్రంతా వారిని తీవ్రంగా కొట్టారని తెలిపారు. ఏప్రిల్ 26న ఉదయం, స్టేషన్ సమీపంలోని ఐతానగర్ రోడ్డుపైకి తీసుకెళ్లి మళ్లీ విచక్షణారహితంగా కొట్టారని, వారి పరువు ప్రతిష్టలతో ఆడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిలో తెనాలి టూ టౌన్ సీఐతో పాటు పక్క పోలీస్ స్టేషన్ సీఐ కూడా పాల్గొన్నారని జగన్ ఆరోపించారు. కాళ్లపై లాఠీలతో కొట్టడం వల్ల తీవ్రమైన గాయాలయ్యాయని, బొబ్బలు కట్టిన దృశ్యాలను ఆయన ప్రస్తావించారు.
ఏప్రిల్ 27న, అంటే మూడో రోజు, యువకులను మరో రోడ్డు సెంటర్ అయిన లింగారావు సెంటర్కు తీసుకెళ్లి పట్టపగలు మళ్లీ రెండోసారి దారుణంగా కొట్టారని జగన్ వివరించారు. మూడు రోజులుగా పోలీసుల అదుపులోనే ఉన్న విక్టర్ జేబులో పోలీసులే ఒక కత్తి పెట్టి, ఇద్దరు వీఆర్ఓలను పిలిపించి, అతని వద్ద మారణాయుధం దొరికినట్లు పంచనామా రాసుకున్నారని సంచలన ఆరోపణ చేశారు. "మూడు రోజులు మీ దగ్గరే ఉన్న వ్యక్తి జేబులోకి కత్తి ఎలా వచ్చింది?" అని జగన్ పోలీసులను సూటిగా ప్రశ్నించారు.
వైద్య పరీక్షలు, కోర్టులో హాజరుపరిచిన తీరుపై ఆగ్రహం
ఇంత దారుణంగా కొట్టి, తీవ్ర గాయాలపాలైన యువకులను ఏప్రిల్ 28న కోర్టులో హాజరుపరిచే ముందు డాక్టర్ వద్దకు తీసుకెళ్లారని, అక్కడ ఎలాంటి గాయాలు లేవని డాక్టర్ చేత సర్టిఫికెట్ ఇప్పించుకున్నారని జగన్ ఆరోపించారు. "పోలీసులు కొట్టారని, గాయాలున్నాయని జడ్జిగారికి చెబితే మళ్లీ ఎస్పీ ఆఫీస్కు తీసుకెళ్లి కరెంట్ షాక్ ఇస్తామని పోలీసులు బెదిరించారు" అని బాధితులు చెప్పినట్లు ఆయన తెలిపారు. "మనం ఏ సమాజంలో ఉన్నాం?" అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ సంధించిన ప్రశ్నలు
ఈ సందర్భంగా జగన్ పోలీసుల తీరుపై పలు కీలక ప్రశ్నలు సంధించారు:
* ఏప్రిల్ 24న తమపై హత్యాప్రయత్నం జరిగిందని కానిస్టేబుల్ చెబుతుంటే, మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు? పోలీస్ స్టేషన్ కిలోమీటర్ దూరంలోనే ఉంది కదా?
* సివిల్ డ్రెస్సులో ఉన్న కానిస్టేబుల్ అంబేద్కర్ విగ్రహం వద్దకు ఎందుకు వచ్చాడు? ఈ ముగ్గురు యువకులతో ఎందుకు గొడవపడ్డాడు?
* ఏప్రిల్ 25న ఉదయం అదుపులోకి తీసుకున్న యువకులను 24 గంటల్లో కోర్టులో ఎందుకు హాజరుపరచలేదు? ఇది చట్టాన్ని ఉల్లంఘించడం కాదా?
* ఈ కేసు టూ టౌన్ పోలీసులు చూస్తుంటే, మరో పోలీస్ స్టేషన్ సీఐకి ఈ కేసుతో ఏం సంబంధం? అతను కూడా ఎందుకు కొట్టాడు?
* కోర్టుకు తీసుకెళ్లే ముందు ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసులు కొట్టారని, గాయాలున్నాయని యువకులు చెప్పినా, డాక్టర్లు ఎందుకు నమోదు చేయలేదు? మెడికో లీగల్ కేసు అవుతుందని భయపడ్డారా లేక ప్రలోభాలకు లొంగిపోయారా?
వీడియో లీక్, రౌడీ షీట్ల వ్యవహారం
ఏప్రిల్ 26న నడిరోడ్డుపై యువకులను కొడుతున్న దృశ్యాలను పోలీసులే వీడియో తీశారని, నెల రోజుల తర్వాత ఆ వీడియో బయటకు వచ్చిందని జగన్ తెలిపారు. పోలీసుల్లోనే కొందరు మంచివారు ఈ అన్యాయాన్ని జీర్ణించుకోలేక వీడియోను విడుదల చేసి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ ఘటన జరిగిన తర్వాత, విషయం పెద్దది అవుతుందని తెలిసి, బాధితులైన రాకేష్, విక్టర్, కరీముల్లాలపై రౌడీ షీట్లు తెరిచారని జగన్ ఆరోపించారు. "ఒక జూనియర్ అడ్వకేట్, పాలిటెక్నిక్ చదివిన విద్యార్థి, మెకానిక్గా పనిచేస్తున్న యువకుడిపై ఎలాంటి ఆధారాలు లేకుండా ఘటన జరిగిన తర్వాత రౌడీ షీట్లు ఎలా తెరుస్తారు?" అని ఆయన ప్రశ్నించారు. వారిపై గతంలో ఏవైనా కేసులుంటే ఉండొచ్చని, కానీ వాటికి ఈ ఘటనకు ఏం సంబంధమని నిలదీశారు. కరీముల్లా అనే 21 ఏళ్ల యువకుడిపై ఎలాంటి పాత కేసులు లేవని ఆయన స్పష్టం చేశారు.
బాధితుల కుటుంబాల్లో చదువుకున్న వాళ్లు ఉన్నారని... రాకేష్ చెల్లెలు ఇంజనీర్ అని, రాకేష్ కూడా పాలిటెక్నిక్ మెకానికల్ చదివాడని జగన్ గుర్తుచేశారు. ఇలాంటి వారి పరువు తీస్తూ, నడిరోడ్డు మీద కొట్టి, పబ్లిక్ షేమింగ్ చేయడం ధర్మమేనా అని ప్రశ్నించారు. పోలీసులు తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి, బాధితులపై సంఘ విద్రోహ శక్తులు, నేరస్తులు, గంజాయి బ్యాచ్, రౌడీలుగా ముద్ర వేస్తున్నారని ఆయన ఆరోపించారు.
మంగళగిరికి చెందిన వారిని తెనాలికి తీసుకొచ్చి కొట్టడం వెనుక ఆంతర్యమేమిటని, ఇది పోలీసులు చెబుతున్నవన్నీ అవాస్తవాలని చెప్పడానికి నిదర్శనం కాదా అని జగన్ వ్యాఖ్యానించారు. ఈ మొత్తం ఘటనపై సమగ్ర విచారణ జరిపి, దోషులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
జగన్ ఏం చెప్పారంటే...!
వైఎస్ జగన్ వెల్లడించిన వివరాల ప్రకారం, తెనాలికి చెందిన రాకేష్ (జొమాటో ఉద్యోగి, హైదరాబాద్లో పనిచేస్తాడు), మంగళగిరికి చెందిన షేబ్రోల్ జాన్ విక్టర్ (జూనియర్ అడ్వకేట్), కరీముల్లా (మెకానిక్) అనే ముగ్గురు యువకులు ఈ ఘటనలో బాధితులుగా ఉన్నారు. వీరు దళిత, మైనారిటీ వర్గాలకు చెందినవారని, అణగారిన వర్గాల యువకులని జగన్ పేర్కొన్నారు.
ఏప్రిల్ 24న తెనాలిలోని ఐతానగర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఓ కానిస్టేబుల్ సివిల్ డ్రెస్సులో ఎవరితోనో గొడవపడుతుండగా, ఈ యువకులు జోక్యం చేసుకుని, "మా ఏరియాకు వచ్చి ఎందుకు గొడవ చేస్తున్నారు?" అని ప్రశ్నించారని జగన్ తెలిపారు. ఇదే వారు చేసిన తప్పయిందని ఆయన అన్నారు. ఆ కానిస్టేబుల్ జాన్ విక్టర్ బైక్ తాళాలు, ఫోన్ లాక్కున్నాడని, వారు వాటిని తిరిగి తీసుకున్న తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోయారని వివరించారు.
అయితే, మరుసటి రోజు ఏప్రిల్ 25న, సదరు కానిస్టేబుల్ మరికొందరు పోలీసులతో కలిసి మంగళగిరి వెళ్లి జాన్ విక్టర్, కరీముల్లాలను కొట్టుకుంటూ తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారని జగన్ ఆరోపించారు. ఆ రోజు రాత్రంతా వారిని తీవ్రంగా కొట్టారని తెలిపారు. ఏప్రిల్ 26న ఉదయం, స్టేషన్ సమీపంలోని ఐతానగర్ రోడ్డుపైకి తీసుకెళ్లి మళ్లీ విచక్షణారహితంగా కొట్టారని, వారి పరువు ప్రతిష్టలతో ఆడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిలో తెనాలి టూ టౌన్ సీఐతో పాటు పక్క పోలీస్ స్టేషన్ సీఐ కూడా పాల్గొన్నారని జగన్ ఆరోపించారు. కాళ్లపై లాఠీలతో కొట్టడం వల్ల తీవ్రమైన గాయాలయ్యాయని, బొబ్బలు కట్టిన దృశ్యాలను ఆయన ప్రస్తావించారు.
ఏప్రిల్ 27న, అంటే మూడో రోజు, యువకులను మరో రోడ్డు సెంటర్ అయిన లింగారావు సెంటర్కు తీసుకెళ్లి పట్టపగలు మళ్లీ రెండోసారి దారుణంగా కొట్టారని జగన్ వివరించారు. మూడు రోజులుగా పోలీసుల అదుపులోనే ఉన్న విక్టర్ జేబులో పోలీసులే ఒక కత్తి పెట్టి, ఇద్దరు వీఆర్ఓలను పిలిపించి, అతని వద్ద మారణాయుధం దొరికినట్లు పంచనామా రాసుకున్నారని సంచలన ఆరోపణ చేశారు. "మూడు రోజులు మీ దగ్గరే ఉన్న వ్యక్తి జేబులోకి కత్తి ఎలా వచ్చింది?" అని జగన్ పోలీసులను సూటిగా ప్రశ్నించారు.
వైద్య పరీక్షలు, కోర్టులో హాజరుపరిచిన తీరుపై ఆగ్రహం
ఇంత దారుణంగా కొట్టి, తీవ్ర గాయాలపాలైన యువకులను ఏప్రిల్ 28న కోర్టులో హాజరుపరిచే ముందు డాక్టర్ వద్దకు తీసుకెళ్లారని, అక్కడ ఎలాంటి గాయాలు లేవని డాక్టర్ చేత సర్టిఫికెట్ ఇప్పించుకున్నారని జగన్ ఆరోపించారు. "పోలీసులు కొట్టారని, గాయాలున్నాయని జడ్జిగారికి చెబితే మళ్లీ ఎస్పీ ఆఫీస్కు తీసుకెళ్లి కరెంట్ షాక్ ఇస్తామని పోలీసులు బెదిరించారు" అని బాధితులు చెప్పినట్లు ఆయన తెలిపారు. "మనం ఏ సమాజంలో ఉన్నాం?" అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ సంధించిన ప్రశ్నలు
ఈ సందర్భంగా జగన్ పోలీసుల తీరుపై పలు కీలక ప్రశ్నలు సంధించారు:
* ఏప్రిల్ 24న తమపై హత్యాప్రయత్నం జరిగిందని కానిస్టేబుల్ చెబుతుంటే, మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు? పోలీస్ స్టేషన్ కిలోమీటర్ దూరంలోనే ఉంది కదా?
* సివిల్ డ్రెస్సులో ఉన్న కానిస్టేబుల్ అంబేద్కర్ విగ్రహం వద్దకు ఎందుకు వచ్చాడు? ఈ ముగ్గురు యువకులతో ఎందుకు గొడవపడ్డాడు?
* ఏప్రిల్ 25న ఉదయం అదుపులోకి తీసుకున్న యువకులను 24 గంటల్లో కోర్టులో ఎందుకు హాజరుపరచలేదు? ఇది చట్టాన్ని ఉల్లంఘించడం కాదా?
* ఈ కేసు టూ టౌన్ పోలీసులు చూస్తుంటే, మరో పోలీస్ స్టేషన్ సీఐకి ఈ కేసుతో ఏం సంబంధం? అతను కూడా ఎందుకు కొట్టాడు?
* కోర్టుకు తీసుకెళ్లే ముందు ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసులు కొట్టారని, గాయాలున్నాయని యువకులు చెప్పినా, డాక్టర్లు ఎందుకు నమోదు చేయలేదు? మెడికో లీగల్ కేసు అవుతుందని భయపడ్డారా లేక ప్రలోభాలకు లొంగిపోయారా?
వీడియో లీక్, రౌడీ షీట్ల వ్యవహారం
ఏప్రిల్ 26న నడిరోడ్డుపై యువకులను కొడుతున్న దృశ్యాలను పోలీసులే వీడియో తీశారని, నెల రోజుల తర్వాత ఆ వీడియో బయటకు వచ్చిందని జగన్ తెలిపారు. పోలీసుల్లోనే కొందరు మంచివారు ఈ అన్యాయాన్ని జీర్ణించుకోలేక వీడియోను విడుదల చేసి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ ఘటన జరిగిన తర్వాత, విషయం పెద్దది అవుతుందని తెలిసి, బాధితులైన రాకేష్, విక్టర్, కరీముల్లాలపై రౌడీ షీట్లు తెరిచారని జగన్ ఆరోపించారు. "ఒక జూనియర్ అడ్వకేట్, పాలిటెక్నిక్ చదివిన విద్యార్థి, మెకానిక్గా పనిచేస్తున్న యువకుడిపై ఎలాంటి ఆధారాలు లేకుండా ఘటన జరిగిన తర్వాత రౌడీ షీట్లు ఎలా తెరుస్తారు?" అని ఆయన ప్రశ్నించారు. వారిపై గతంలో ఏవైనా కేసులుంటే ఉండొచ్చని, కానీ వాటికి ఈ ఘటనకు ఏం సంబంధమని నిలదీశారు. కరీముల్లా అనే 21 ఏళ్ల యువకుడిపై ఎలాంటి పాత కేసులు లేవని ఆయన స్పష్టం చేశారు.
బాధితుల కుటుంబాల్లో చదువుకున్న వాళ్లు ఉన్నారని... రాకేష్ చెల్లెలు ఇంజనీర్ అని, రాకేష్ కూడా పాలిటెక్నిక్ మెకానికల్ చదివాడని జగన్ గుర్తుచేశారు. ఇలాంటి వారి పరువు తీస్తూ, నడిరోడ్డు మీద కొట్టి, పబ్లిక్ షేమింగ్ చేయడం ధర్మమేనా అని ప్రశ్నించారు. పోలీసులు తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి, బాధితులపై సంఘ విద్రోహ శక్తులు, నేరస్తులు, గంజాయి బ్యాచ్, రౌడీలుగా ముద్ర వేస్తున్నారని ఆయన ఆరోపించారు.
మంగళగిరికి చెందిన వారిని తెనాలికి తీసుకొచ్చి కొట్టడం వెనుక ఆంతర్యమేమిటని, ఇది పోలీసులు చెబుతున్నవన్నీ అవాస్తవాలని చెప్పడానికి నిదర్శనం కాదా అని జగన్ వ్యాఖ్యానించారు. ఈ మొత్తం ఘటనపై సమగ్ర విచారణ జరిపి, దోషులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.