Virat Kohli: ఐపీఎల్ ఫైనల్... స్లో బంతులతో ఆర్సీబీకి కళ్లెం వేసిన పంజాబ్ బౌలర్లు

- ఐపీఎల్ 2025 ఫైనల్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది
- పంజాబ్కు 191 పరుగుల విజయ లక్ష్యం నిర్దేశించిన ఆర్సీబీ
- బెంగళూరు తరఫున పటిదార్ (26) టాప్ స్కోరర్
- పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్, జేమీసన్కు చెరో మూడు వికెట్లు
- టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బౌలర్లు సమయోచితంగా రాణించడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు 200 పరుగులు కూడా చేయలేకపోయింది. ఈ టైటిల్ సమరంలో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. పంజాబ్ పేసర్ అర్షదీప్ సింగ్ విసిరిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో బెంగళూరు టీమ్ కేవలం 3 పరుగులే చేసి 3 వికెట్లు కోల్పోయింది. 35 బంతుల్లో 43 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్ గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లు పక్కా ప్రణాళికతో స్లో బంతులు విసిరి ఆర్సీబీ బ్యాటర్లను కట్టడి చేశారు.
ఆర్సీబీ ఇన్నింగ్స్ను ఫిలిప్ సాల్ట్, మయాంక్ అగర్వాల్ ఆరంభించారు. సాల్ట్ (9 బంతుల్లో 16 పరుగులు, 2 ఫోర్లు, 1 సిక్సర్) దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ, 18 పరుగుల వద్ద జట్టు తొలి వికెట్గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన మయాంక్ అగర్వాల్ (18 బంతుల్లో 24 పరుగులు, 2 ఫోర్లు, 1 సిక్సర్)తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. పవర్ప్లే ముగిసేసరికి ఆర్సీబీ ఒక వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. అయితే, 56 పరుగుల వద్ద మయాంక్ రెండో వికెట్గా ఔటయ్యాడు.
కెప్టెన్ రజత్ పటిదార్ (16 బంతుల్లో 26 పరుగులు, 1 ఫోర్, 2 సిక్సర్లు) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా క్రీజులో ఎక్కువసేపు నిలవలేకపోయాడు. పటిదార్ జట్టు స్కోరు 96 పరుగుల వద్ద మూడో వికెట్గా వెనుదిరగ్గా, కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ 14.5 ఓవర్లలో జట్టు స్కోరు 131 వద్ద నాలుగో వికెట్గా ఔటయ్యాడు. లియామ్ లివింగ్స్టోన్ (15 బంతుల్లో 25 పరుగులు, 2 సిక్సర్లు), వికెట్ కీపర్ జితేశ్ శర్మ (10 బంతుల్లో 24 పరుగులు, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు వేగంతో పరుగులు సాధించి జట్టు స్కోరును పెంచారు. అయితే అది కాసేపే అయింది. రొమారియో షెపర్డ్ (9 బంతుల్లో 17 పరుగులు, 1 ఫోర్, 1 సిక్సర్) కూడా తన వంతు సహకారం అందించాడు.
అయితే, పంజాబ్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఆర్సీబీ భారీ స్కోరు చేయలేకపోయింది. కృనాల్ పాండ్యా (4), భువనేశ్వర్ కుమార్ (1) స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు. యశ్ దయాల్ (1) నాటౌట్గా నిలిచాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో మొత్తం 9 పరుగులు ఎక్స్ట్రాల రూపంలో వచ్చాయి.
పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 40 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. కైల్ జేమీసన్ కూడా 4 ఓవర్లలో 48 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్, విజయ్కుమార్ వైశాఖ్, యజువేంద్ర చాహల్ తలో వికెట్ సాధించారు. పంజాబ్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా ఆర్సీబీ ఆశించిన స్థాయిలో భారీ స్కోరు చేయలేకపోయింది.
ఆర్సీబీ ఇన్నింగ్స్ను ఫిలిప్ సాల్ట్, మయాంక్ అగర్వాల్ ఆరంభించారు. సాల్ట్ (9 బంతుల్లో 16 పరుగులు, 2 ఫోర్లు, 1 సిక్సర్) దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ, 18 పరుగుల వద్ద జట్టు తొలి వికెట్గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన మయాంక్ అగర్వాల్ (18 బంతుల్లో 24 పరుగులు, 2 ఫోర్లు, 1 సిక్సర్)తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. పవర్ప్లే ముగిసేసరికి ఆర్సీబీ ఒక వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. అయితే, 56 పరుగుల వద్ద మయాంక్ రెండో వికెట్గా ఔటయ్యాడు.
కెప్టెన్ రజత్ పటిదార్ (16 బంతుల్లో 26 పరుగులు, 1 ఫోర్, 2 సిక్సర్లు) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా క్రీజులో ఎక్కువసేపు నిలవలేకపోయాడు. పటిదార్ జట్టు స్కోరు 96 పరుగుల వద్ద మూడో వికెట్గా వెనుదిరగ్గా, కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ 14.5 ఓవర్లలో జట్టు స్కోరు 131 వద్ద నాలుగో వికెట్గా ఔటయ్యాడు. లియామ్ లివింగ్స్టోన్ (15 బంతుల్లో 25 పరుగులు, 2 సిక్సర్లు), వికెట్ కీపర్ జితేశ్ శర్మ (10 బంతుల్లో 24 పరుగులు, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు వేగంతో పరుగులు సాధించి జట్టు స్కోరును పెంచారు. అయితే అది కాసేపే అయింది. రొమారియో షెపర్డ్ (9 బంతుల్లో 17 పరుగులు, 1 ఫోర్, 1 సిక్సర్) కూడా తన వంతు సహకారం అందించాడు.
అయితే, పంజాబ్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఆర్సీబీ భారీ స్కోరు చేయలేకపోయింది. కృనాల్ పాండ్యా (4), భువనేశ్వర్ కుమార్ (1) స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు. యశ్ దయాల్ (1) నాటౌట్గా నిలిచాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో మొత్తం 9 పరుగులు ఎక్స్ట్రాల రూపంలో వచ్చాయి.
పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 40 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. కైల్ జేమీసన్ కూడా 4 ఓవర్లలో 48 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్, విజయ్కుమార్ వైశాఖ్, యజువేంద్ర చాహల్ తలో వికెట్ సాధించారు. పంజాబ్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా ఆర్సీబీ ఆశించిన స్థాయిలో భారీ స్కోరు చేయలేకపోయింది.