Kanchan Devi: పంజాబ్ లో ఇన్ ఫ్లుయెన్సర్ కాంచన్ దేవి దారుణ హత్య

- పంజాబ్లోని బఠిండాలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ హత్య
- నైతిక పోలీసింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న పంజాబ్ పోలీసులు
- 'బోల్డ్' పోస్టులు పెడుతోందని నిహాంగ్ వర్గ వ్యక్తి ప్లాన్ చేసినట్లు వెల్లడి
- హత్యకు పాల్పడిన ఇద్దరు అరెస్ట్, ప్రధాన సూత్రధారి పరారీ
- కారు వీడియో షూటింగ్ నెపంతో పిలిపించి, గొంతు నులిమి చంపిన దుండగులు
- నిందితుల్లో ఇద్దరిపై గతంలోనూ ఇలాంటి కేసు నమోదు
పంజాబ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో 'బోల్డ్' కంటెంట్తో వీడియోలు పోస్ట్ చేస్తోందన్న కారణంతో ఓ ఇన్ఫ్లుయెన్సర్ను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. బతిండాలో జరిగిన ఈ ఘటన నైతిక పోలీసింగ్ (మోరల్ పోలీసింగ్) చర్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. కమల్ కౌర్ బాబీగా పేరుపొందిన 25 ఏళ్ల కాంచన్ దేవి అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ను గొంతు నులిమి చంపి, ఆమె కారులోనే మృతదేహాన్ని వదిలేసి వెళ్లిపోయారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయగా, ప్రధాన సూత్రధారి పరారీలో ఉన్నాడు.
వివరాల్లోకి వెళితే, కాంచన్ దేవి ఇన్స్టాగ్రామ్లో తరచూ బోల్డ్ వీడియోలు పోస్ట్ చేసేవారు. ఆమె పోస్టులు "సమాజాన్ని పాడుచేస్తున్నాయని" భావించిన అమృతపాల్ సింగ్ మెహ్రో అనే నిహాంగ్ వర్గానికి చెందిన వ్యక్తి ఆమె హత్యకు కుట్ర పన్నినట్లు బఠిండా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) అమ్నీత్ కొండల్ తెలిపారు. అమృతపాల్ గతంలోనే కాంచన్ను బెదిరించినట్లు సమాచారం. ఆ తర్వాత, కార్లకు సంబంధించిన వీడియో ప్రమోషన్ చేయాలనే నెపంతో ఆమెను సంప్రదించాడు.
జూన్ 7, 8 తేదీల్లో అమృతపాల్ సింగ్.. లూథియానాలోని కాంచన్ దేవి ఇంటికి వెళ్లి, వీడియో షూటింగ్ కోసం ఒప్పించాడు. అనంతరం జూన్ 9న, తన అనుచరులైన జస్ప్రీత్ సింగ్, నిమ్రత్జిత్ సింగ్లను ఓ స్కార్పియో ఎస్యూవీలో పంపి కాంచన్ను బఠిండాకు తీసుకురమ్మన్నాడు. కాంచన్ తన సొంత హ్యుందాయ్ ఇయాన్ కారులో బయలుదేరింది. బఠిండా సమీపంలోకి రాగానే, కారు రిపేర్ చేయించాలనే సాకుతో ఓ కార్ వర్క్షాప్ వద్ద ఆగారు. అక్కడ, నిందితులిద్దరూ ఆమెను 'అశ్లీల' కంటెంట్ పోస్ట్ చేయడం మానేయాలని, తన పేరులోంచి 'కౌర్' అనే పదాన్ని తొలగించాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది.
ఆ తర్వాత, కాంచన్ దేవి తన కారులో ఉన్న సమయంలో జస్ప్రీత్ సింగ్ ఓ గుడ్డతో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని వెనుక సీట్లో ఉంచి, కారును ఆదేశ్ మెడికల్ యూనివర్సిటీ సమీపంలో పార్క్ చేసి వెళ్లిపోయారు. ఈ కేసుకు సంబంధించి జస్ప్రీత్ సింగ్, నిమ్రత్జిత్ సింగ్లను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అమృతపాల్ సింగ్ మెహ్రో ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నిందితులపై హత్య, సాక్ష్యాల ధ్వంసం కింద కేసు నమోదు చేశారు.
పోలీసుల దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. అమృతపాల్ సింగ్, నిమ్రత్జిత్ సింగ్లపై 2021లో బర్నాలా జిల్లాలోని ధనౌలా పోలీస్ స్టేషన్లో ఇలాంటి నైతిక పోలీసింగ్ కేసే నమోదైందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన సోషల్ మీడియా వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే, కాంచన్ దేవి ఇన్స్టాగ్రామ్లో తరచూ బోల్డ్ వీడియోలు పోస్ట్ చేసేవారు. ఆమె పోస్టులు "సమాజాన్ని పాడుచేస్తున్నాయని" భావించిన అమృతపాల్ సింగ్ మెహ్రో అనే నిహాంగ్ వర్గానికి చెందిన వ్యక్తి ఆమె హత్యకు కుట్ర పన్నినట్లు బఠిండా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) అమ్నీత్ కొండల్ తెలిపారు. అమృతపాల్ గతంలోనే కాంచన్ను బెదిరించినట్లు సమాచారం. ఆ తర్వాత, కార్లకు సంబంధించిన వీడియో ప్రమోషన్ చేయాలనే నెపంతో ఆమెను సంప్రదించాడు.
జూన్ 7, 8 తేదీల్లో అమృతపాల్ సింగ్.. లూథియానాలోని కాంచన్ దేవి ఇంటికి వెళ్లి, వీడియో షూటింగ్ కోసం ఒప్పించాడు. అనంతరం జూన్ 9న, తన అనుచరులైన జస్ప్రీత్ సింగ్, నిమ్రత్జిత్ సింగ్లను ఓ స్కార్పియో ఎస్యూవీలో పంపి కాంచన్ను బఠిండాకు తీసుకురమ్మన్నాడు. కాంచన్ తన సొంత హ్యుందాయ్ ఇయాన్ కారులో బయలుదేరింది. బఠిండా సమీపంలోకి రాగానే, కారు రిపేర్ చేయించాలనే సాకుతో ఓ కార్ వర్క్షాప్ వద్ద ఆగారు. అక్కడ, నిందితులిద్దరూ ఆమెను 'అశ్లీల' కంటెంట్ పోస్ట్ చేయడం మానేయాలని, తన పేరులోంచి 'కౌర్' అనే పదాన్ని తొలగించాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది.
ఆ తర్వాత, కాంచన్ దేవి తన కారులో ఉన్న సమయంలో జస్ప్రీత్ సింగ్ ఓ గుడ్డతో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని వెనుక సీట్లో ఉంచి, కారును ఆదేశ్ మెడికల్ యూనివర్సిటీ సమీపంలో పార్క్ చేసి వెళ్లిపోయారు. ఈ కేసుకు సంబంధించి జస్ప్రీత్ సింగ్, నిమ్రత్జిత్ సింగ్లను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అమృతపాల్ సింగ్ మెహ్రో ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నిందితులపై హత్య, సాక్ష్యాల ధ్వంసం కింద కేసు నమోదు చేశారు.
పోలీసుల దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. అమృతపాల్ సింగ్, నిమ్రత్జిత్ సింగ్లపై 2021లో బర్నాలా జిల్లాలోని ధనౌలా పోలీస్ స్టేషన్లో ఇలాంటి నైతిక పోలీసింగ్ కేసే నమోదైందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన సోషల్ మీడియా వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.