Sekhar Kammula: కుబేర సినిమా నిడివిపై శేఖర్ కమ్ముల వివరణ ఇదే..!

––
శేఖర్ కమ్ముల తాజా చిత్రం కుబేర నిన్న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే, సినిమా నిడివి కాస్త ఎక్కువైందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనిపై హైదరాబాద్లో ఈ సినిమా సక్సెస్ ప్రెస్మీట్ లో శేఖర్ కమ్ముల వివరణ ఇచ్చారు. నిడివి విషయంలో ఎక్కడ కత్తెర వేయాలనే విషయం దర్శకుడిగా తనకు తెలుసని, అయితే, ఈ సినిమాకు అవసరమేనని అన్నారు.
ప్రెస్ మీట్ లో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ‘‘ఇప్పటివరకూ నేను చేసిన చిత్రాల్లో ‘కుబేర’ అద్భుతమైన చిత్రం. ఈ కథ అనుకున్నప్పటినుంచే సినిమాను వాస్తవికతకు దగ్గరగా తీయాలనుకున్నాం. బడ్జెట్ పెరిగిపోతున్న ప్రతిసారీ కథలో కోతలు విధించాలనుకున్నా. ఆ టైంలో నా టీమ్ ఎంతో సపోర్ట్గా నిలిచింది. నిడివి విషయానికి వస్తే.. అవసరమైనప్పుడు సినిమాకు కత్తెర వేయాలనేది దర్శకుడికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, ఈ సినిమాలో ప్రతీ సీన్ ఉండాల్సిందే. కత్తెర వేయడానికి అవకాశం లేనంతగా చేశాకే నిడివి ఇలా ఉంది. ఈ సినిమాలో ఎన్నో కోణాలు ఉన్నాయి. ప్రేక్షకులు సినిమా చూస్తున్నప్పుడు సాగదీతగా ఉందని అనుకోరనుకుంటున్నా’’ అని శేఖర్ కమ్ముల చెప్పారు.
ప్రెస్ మీట్ లో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ‘‘ఇప్పటివరకూ నేను చేసిన చిత్రాల్లో ‘కుబేర’ అద్భుతమైన చిత్రం. ఈ కథ అనుకున్నప్పటినుంచే సినిమాను వాస్తవికతకు దగ్గరగా తీయాలనుకున్నాం. బడ్జెట్ పెరిగిపోతున్న ప్రతిసారీ కథలో కోతలు విధించాలనుకున్నా. ఆ టైంలో నా టీమ్ ఎంతో సపోర్ట్గా నిలిచింది. నిడివి విషయానికి వస్తే.. అవసరమైనప్పుడు సినిమాకు కత్తెర వేయాలనేది దర్శకుడికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, ఈ సినిమాలో ప్రతీ సీన్ ఉండాల్సిందే. కత్తెర వేయడానికి అవకాశం లేనంతగా చేశాకే నిడివి ఇలా ఉంది. ఈ సినిమాలో ఎన్నో కోణాలు ఉన్నాయి. ప్రేక్షకులు సినిమా చూస్తున్నప్పుడు సాగదీతగా ఉందని అనుకోరనుకుంటున్నా’’ అని శేఖర్ కమ్ముల చెప్పారు.