Nimmavastugilage Neeve Javabdararu: 'మీ వస్తువులకు మీరే బాధ్యులు' ఓటీటీలో కన్నడ క్రైమ్ డ్రామా!

- కన్నడలో రూపొందిన సినిమా
- అక్కడి థియేటర్ల నుంచి మంచి రెస్పాన్స్
- ముగ్గురు వ్యక్తుల చుట్టూ తిరిగే కథ
- ఈ నెల 27 నుంచి సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్
పబ్లిక్ తో ముడిపడి ఉన్న ఏ ప్రదేశాలకు వెళ్లినా, 'మీ వస్తువులకు మీరే బాధ్యులు' అనే బోర్డులు కనిపిస్తూనే ఉంటాయి. ఈ వాక్యాన్ని టైటిల్ గా తీసుకుని కన్నడలో రూపొందిన సినిమానే 'నిమ్మ వస్తుగళిగే నీవే జవాబుదారారు'. కేశవ్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా, జనవరిలో అక్కడ విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.
అలాంటి ఈ సినిమా ఇప్పుడు 'సన్ నెక్స్ట్' ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఈ నెల 27వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. 'సన్ నెక్స్ట్' వారు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ కూడా వదిలారు. ఇది ఆంథాలజీ కాన్సెప్ట్ తో నిర్మితమైన సినిమా. బెంగుళూరు నేపథ్యంలో .. ఒక ముగ్గురు వ్యక్తుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
ముగ్గురు వ్యక్తులు .. ఒక్కొక్కరూ ఒక్కో చిత్రమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. వాళ్లలో ఒకరు కోటీశ్వరుడు. అయినా తన కంటికి నచ్చిన వస్తువులను కాజేస్తూ ఉంటాడు. అదొక మానసిక స్థితి అంతే. అలాగే విలక్షణమైన స్వభావం కలిగిన మరో ఇద్దరూ. ఈ ముగ్గురి జీవితాలు ఏ తీరానికి చేరుకున్నాయనేది కథ. ముఖ్యమైన పాత్రలలో దిలీప్ రాజ్ .. శిల్పా మంజునాథ్ .. అపూర్వ భరద్వాజ్ .. కనిపించనున్నారు.
అలాంటి ఈ సినిమా ఇప్పుడు 'సన్ నెక్స్ట్' ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఈ నెల 27వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. 'సన్ నెక్స్ట్' వారు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ కూడా వదిలారు. ఇది ఆంథాలజీ కాన్సెప్ట్ తో నిర్మితమైన సినిమా. బెంగుళూరు నేపథ్యంలో .. ఒక ముగ్గురు వ్యక్తుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
ముగ్గురు వ్యక్తులు .. ఒక్కొక్కరూ ఒక్కో చిత్రమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. వాళ్లలో ఒకరు కోటీశ్వరుడు. అయినా తన కంటికి నచ్చిన వస్తువులను కాజేస్తూ ఉంటాడు. అదొక మానసిక స్థితి అంతే. అలాగే విలక్షణమైన స్వభావం కలిగిన మరో ఇద్దరూ. ఈ ముగ్గురి జీవితాలు ఏ తీరానికి చేరుకున్నాయనేది కథ. ముఖ్యమైన పాత్రలలో దిలీప్ రాజ్ .. శిల్పా మంజునాథ్ .. అపూర్వ భరద్వాజ్ .. కనిపించనున్నారు.