Seethakka: మంత్రి సీతక్కపై మావోయిస్టుల ఆగ్రహం

- ఆదివాసీల హక్కుల ఉల్లంఘనపై సీతక్క మౌనాన్ని తప్పుపట్టిన మావోలు
- కాంగ్రెస్ తెచ్చిన పెసా, 1/70 చట్టాలను గుర్తు చేసిన మావోయిస్టులు
- జీవో 49ని రద్దు చేయాలని డిమాండ్
తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్కకు మావోయిస్టుల నుంచి తీవ్ర హెచ్చరిక ఎదురైంది. రాష్ట్రంలో ఆదివాసీల హక్కులకు భంగం వాటిల్లుతున్నా, మంత్రిగా సీతక్క ఏమాత్రం స్పందించడం లేదని మావోయిస్టులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఈరోజు ఒక ప్రకటన విడుదల కావడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.
ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో అటవీ, పోలీస్ అధికారులు ఆదివాసీలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నా మంత్రి సీతక్క మౌనంగా ఉండటాన్ని వారు తీవ్రంగా తప్పుపట్టారు. గతంలో కాంగ్రెస్ పార్టీయే తీసుకొచ్చిన పెసా, 1/70 చట్టాలను మంత్రిగా సీతక్క విస్మరించారా అంటూ తమ లేఖలో సూటిగా ప్రశ్నించారు. ఆమె గిరిజనుల హక్కుల గురించి మాట్లాడకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆదివాసీల హక్కుల పరిరక్షణకు సీతక్క పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
ముఖ్యంగా, ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 49పై మావోయిస్టులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జీవోను అడ్డం పెట్టుకొని కుమురం భీమ్ జిల్లాలోని 339 ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఈ జీవో వల్ల రాష్ట్రంలోని మూడు జిల్లాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చేందుకే ఈ జీవోను తీసుకొచ్చారని ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు.
వివాదాస్పదమైన జీవో నెం. 49ని తెలంగాణ ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని మావోయిస్టులు తమ లేఖలో డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించినట్లు సమాచారం. ఈ లేఖ ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది.
ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో అటవీ, పోలీస్ అధికారులు ఆదివాసీలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నా మంత్రి సీతక్క మౌనంగా ఉండటాన్ని వారు తీవ్రంగా తప్పుపట్టారు. గతంలో కాంగ్రెస్ పార్టీయే తీసుకొచ్చిన పెసా, 1/70 చట్టాలను మంత్రిగా సీతక్క విస్మరించారా అంటూ తమ లేఖలో సూటిగా ప్రశ్నించారు. ఆమె గిరిజనుల హక్కుల గురించి మాట్లాడకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆదివాసీల హక్కుల పరిరక్షణకు సీతక్క పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
ముఖ్యంగా, ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 49పై మావోయిస్టులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జీవోను అడ్డం పెట్టుకొని కుమురం భీమ్ జిల్లాలోని 339 ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఈ జీవో వల్ల రాష్ట్రంలోని మూడు జిల్లాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చేందుకే ఈ జీవోను తీసుకొచ్చారని ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు.
వివాదాస్పదమైన జీవో నెం. 49ని తెలంగాణ ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని మావోయిస్టులు తమ లేఖలో డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించినట్లు సమాచారం. ఈ లేఖ ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది.