Medak Family Suicide: మెదక్ జిల్లా కోర్టు భవనం పైనుంచి దూకిన కుటుంబం... ఒకరి మృతి

- కోర్టు భవనం పైకి వెళ్లిన దంపతులు, ఇద్దరు కుమార్తెలు
- భవనం పైనుంచి దూకిన కుటుంబ సభ్యులు
- భార్య మృతి, మిగతా వారికి తీవ్రగాయాలు
- చికిత్స కోసం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మెదక్ జిల్లా కోర్టు భవనం పైనుంచి దూకి ఒక కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శనివారం జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల ప్రకారం, దంపతులు తమ ఇద్దరు కుమార్తెలతో కలిసి కోర్టు భవనం పైకి చేరుకొని, అక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్యాయత్నం చేశారు.
ఈ దుర్ఘటనలో భార్య మృతి చెందగా, భర్త మరియు ఇద్దరు కుమార్తెలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులను దౌలతాబాద్ గ్రామ వాసులుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న దర్యాప్తు ప్రారంభించారు.
ఈ దుర్ఘటనలో భార్య మృతి చెందగా, భర్త మరియు ఇద్దరు కుమార్తెలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులను దౌలతాబాద్ గ్రామ వాసులుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న దర్యాప్తు ప్రారంభించారు.