Ratnakar Sahu: ఒడిశాలో దారుణం.. డిప్యూటీ కమిషనర్ను ఆఫీసు నుంచి బయటకు ఈడ్చుకొచ్చి చితక్కొట్టిన దుండగులు.. వీడియో ఇదిగో!

- భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్పై దాడి
- ప్రజా సమస్యలు వింటుండగా ఆఫీసులోకి దూసుకొచ్చిన దుండగులు
- అధికారి కాలర్ పట్టుకుని బయటకు లాగి దాడి చేసిన వైనం
- ఈ దాడి వెనుక బీజేపీ నేతల హస్తం ఉందన్న మాజీ సీఎం నవీన్ పట్నాయక్
ప్రభుత్వ కార్యాలయంలోనే ఓ ఉన్నతాధికారిపై కొందరు యువకులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో జరిగిందీ ఘటన. మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అదనపు కమిషనర్ రత్నాకర్ సాహు ప్రజా సమస్యలపై సమీక్ష నిర్వహిస్తుండగా, దుండగులు ఆయన చాంబర్లోకి దూసుకొచ్చి దాడి చేశారు. బూతులు తిడుతూ, కాలర్ పట్టుకుని కార్యాలయం బయటకు లాక్కెళ్లారు.
బీఎంసీ కార్యాలయంలో నిన్న అదనపు కమిషనర్ రత్నాకర్ సాహు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఆరుగురు యువకులు ఒక్కసారిగా ఆయన చాంబర్లోకి ప్రవేశించారు. అక్కడున్న సిబ్బంది, సందర్శకులు చూస్తుండగానే సాహుపై పిడిగుద్దులు కురిపించారు. ఆయన్ను అసభ్య పదజాలంతో దూషిస్తూ, చొక్కా కాలర్ పట్టుకుని బయటకు ఈడ్చుకెళ్లి దాడి చేశారు. ఈ అకస్మాత్తు పరిణామంతో కార్యాలయంలోని వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఈ దాడి ఘటనపై రత్నాకర్ సాహు మీడియాతో మాట్లాడారు. "కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో నేను ప్రజా సమస్యలపై సమీక్ష చేస్తున్నాను. ఇంతలో కార్పొరేటర్ జీవన్ బాబు, మరో ఐదారుగురు వ్యక్తులు నా వద్దకు వచ్చారు. 'జగా భాయ్తో ఏమైనా తప్పుగా ప్రవర్తించావా?' అని జీవన్ బాబు నన్ను ప్రశ్నించారు. నేను అలాంటిదేమీ చేయలేదని చెప్పాను. ఆ వెంటనే వాళ్లు నాపై చేయి చేసుకుని, కారులోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. నాపై దాడి చేసిన వాళ్లు ఎవరో నాకు తెలియదు. దాడికి అసలు కారణం ఏమిటో కూడా అర్థం కావడం లేదు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాను" అని ఆయన వివరించారు.
భగ్గుమన్న మాజీ సీఎం నవీన్ పట్నాయక్
ప్రభుత్వ అధికారిపై జరిగిన ఈ దాడిని ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. ఈ ఘటనపై ప్రస్తుత ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
"ఈ వీడియో చూసి నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. అదనపు కార్యదర్శి స్థాయి అధికారి అయిన రత్నాకర్ సాహును కార్యాలయం నుంచి బయటకు లాగి దారుణంగా తన్నడం దారుణం. ఓ బీజేపీ కార్పొరేటర్ సమక్షంలో, ఓడిపోయిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థికి సంబంధించిన వ్యక్తులు ఈ దాడికి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అధికారి ప్రజా సమస్యలు వింటున్న సమయంలో పట్టపగలు జరిగిన ఈ దాడి సిగ్గుచేటు. ఈ ఘటనకు పాల్పడిన వారితో పాటు, దీని వెనుక కుట్ర చేసిన రాజకీయ నాయకులపై కూడా సీఎం కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే ఒడిశా ప్రజలు ఈ ప్రభుత్వాన్ని క్షమించరు" అని నవీన్ పట్నాయక్ ఎక్స్లో పోస్ట్ చేశారు.
మరోవైపు, తమ ఉన్నతాధికారిపై దాడిని నిరసిస్తూ బీఎంసీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కార్యాలయం ఆవరణలోనే బైఠాయించి, పనులు నిలిపివేశారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని, తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు, పోలీసులు బీఎంసీ కార్యాలయానికి చేరుకుని ఉద్యోగులతో మాట్లాడారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
బీఎంసీ కార్యాలయంలో నిన్న అదనపు కమిషనర్ రత్నాకర్ సాహు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఆరుగురు యువకులు ఒక్కసారిగా ఆయన చాంబర్లోకి ప్రవేశించారు. అక్కడున్న సిబ్బంది, సందర్శకులు చూస్తుండగానే సాహుపై పిడిగుద్దులు కురిపించారు. ఆయన్ను అసభ్య పదజాలంతో దూషిస్తూ, చొక్కా కాలర్ పట్టుకుని బయటకు ఈడ్చుకెళ్లి దాడి చేశారు. ఈ అకస్మాత్తు పరిణామంతో కార్యాలయంలోని వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఈ దాడి ఘటనపై రత్నాకర్ సాహు మీడియాతో మాట్లాడారు. "కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో నేను ప్రజా సమస్యలపై సమీక్ష చేస్తున్నాను. ఇంతలో కార్పొరేటర్ జీవన్ బాబు, మరో ఐదారుగురు వ్యక్తులు నా వద్దకు వచ్చారు. 'జగా భాయ్తో ఏమైనా తప్పుగా ప్రవర్తించావా?' అని జీవన్ బాబు నన్ను ప్రశ్నించారు. నేను అలాంటిదేమీ చేయలేదని చెప్పాను. ఆ వెంటనే వాళ్లు నాపై చేయి చేసుకుని, కారులోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. నాపై దాడి చేసిన వాళ్లు ఎవరో నాకు తెలియదు. దాడికి అసలు కారణం ఏమిటో కూడా అర్థం కావడం లేదు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాను" అని ఆయన వివరించారు.
భగ్గుమన్న మాజీ సీఎం నవీన్ పట్నాయక్
ప్రభుత్వ అధికారిపై జరిగిన ఈ దాడిని ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. ఈ ఘటనపై ప్రస్తుత ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
"ఈ వీడియో చూసి నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. అదనపు కార్యదర్శి స్థాయి అధికారి అయిన రత్నాకర్ సాహును కార్యాలయం నుంచి బయటకు లాగి దారుణంగా తన్నడం దారుణం. ఓ బీజేపీ కార్పొరేటర్ సమక్షంలో, ఓడిపోయిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థికి సంబంధించిన వ్యక్తులు ఈ దాడికి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అధికారి ప్రజా సమస్యలు వింటున్న సమయంలో పట్టపగలు జరిగిన ఈ దాడి సిగ్గుచేటు. ఈ ఘటనకు పాల్పడిన వారితో పాటు, దీని వెనుక కుట్ర చేసిన రాజకీయ నాయకులపై కూడా సీఎం కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే ఒడిశా ప్రజలు ఈ ప్రభుత్వాన్ని క్షమించరు" అని నవీన్ పట్నాయక్ ఎక్స్లో పోస్ట్ చేశారు.
మరోవైపు, తమ ఉన్నతాధికారిపై దాడిని నిరసిస్తూ బీఎంసీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కార్యాలయం ఆవరణలోనే బైఠాయించి, పనులు నిలిపివేశారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని, తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు, పోలీసులు బీఎంసీ కార్యాలయానికి చేరుకుని ఉద్యోగులతో మాట్లాడారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.