Payyavula Keshav: రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో కీలక ప్రతిపాదన చేసిన పయ్యావుల కేశవ్

- జీఎస్టీపై ఢిల్లీలో జరిగిన ఆర్థిక మంత్రుల కమిటీ సమావేశం
- అనంతపురం నుంచి వర్చువల్గా పాల్గొన్న మంత్రి పయ్యావుల కేశవ్
- రాష్ట్రాల మధ్య జీఎస్టీ సమాచారం పంచుకోవాలని సూచన
జీఎస్టీ ఎగవేతలను సమర్థంగా అరికట్టేందుకు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, సమాచార మార్పిడి అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. పన్ను ఎగవేతదారులను కట్టడి చేసేందుకు వీలుగా రాష్ట్రాల మధ్య జీఎస్టీ సమాచారాన్ని పంచుకోవాలని ఆయన కేంద్రానికి సూచించారు.
దేశవ్యాప్తంగా జీఎస్టీ అమలు తీరు, ఎదురవుతున్న సవాళ్లపై చర్చించేందుకు వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల కమిటీ శుక్రవారం ఢిల్లీలో సమావేశమైంది. ఈ ఉన్నత స్థాయి సమావేశానికి మంత్రి పయ్యావుల కేశవ్ అనంతపురం కలెక్టరేట్ నుంచి వర్చువల్ విధానంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక రాష్ట్రానికి చెందిన జీఎస్టీ వివరాలు ఇతర రాష్ట్రాలకు తెలిస్తే పన్ను ఎగవేతలను గుర్తించడం సులభమవుతుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ విధానాన్ని బలంగా ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం, రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు, పన్ను ఎగవేతలను నిరోధించడానికి తీసుకుంటున్న చర్యలపై పయ్యావుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఏపీలో జీఎస్టీ అధికారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత యాప్ అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. దీని ద్వారా పన్ను ఎగవేతలను సమర్థంగా గుర్తిస్తున్నామని, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.
దేశవ్యాప్తంగా జీఎస్టీ అమలు తీరు, ఎదురవుతున్న సవాళ్లపై చర్చించేందుకు వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల కమిటీ శుక్రవారం ఢిల్లీలో సమావేశమైంది. ఈ ఉన్నత స్థాయి సమావేశానికి మంత్రి పయ్యావుల కేశవ్ అనంతపురం కలెక్టరేట్ నుంచి వర్చువల్ విధానంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక రాష్ట్రానికి చెందిన జీఎస్టీ వివరాలు ఇతర రాష్ట్రాలకు తెలిస్తే పన్ను ఎగవేతలను గుర్తించడం సులభమవుతుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ విధానాన్ని బలంగా ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం, రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు, పన్ను ఎగవేతలను నిరోధించడానికి తీసుకుంటున్న చర్యలపై పయ్యావుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఏపీలో జీఎస్టీ అధికారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత యాప్ అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. దీని ద్వారా పన్ను ఎగవేతలను సమర్థంగా గుర్తిస్తున్నామని, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.