నెల్లూరుపాలెం ఎస్టీ కాలనీలో పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు

  • పేదల సేవలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు
  • ఎస్టీ కాలనీలోని అంకోజి ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి
  • కూతురు, కొడుకుకి ప్రభుత్వం తరపున సాయం ప్రకటన
ఈ రోజు ఒకటో తేదీ సందర్భంగా ఏపీ వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నెల్లూరుపాలెంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా 'పేదల సేవలో పింఛన్ పంపిణీ' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నెల్లూరుపాలెంలోని ఎస్టీ కాలనీలోని అంకోజి ఇంటికి చంద్రబాబు వెళ్లారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద అంకోజి కూతురు చలంచర్ల సుస్మితకు ముఖ్యమంత్రి వితంతు పెన్షన్ పంపిణీ చేశారు. అనంతరం ఆ కుటుంబ సభ్యుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

టీటీసీ చదివిన సుస్మితకు డీఎస్సీలో ఉద్యోగం కోసం ఉచితంగా శిక్షణ ఇప్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే ఆమె ఐదేళ్ల కూతురుని గురుకుల పాఠశాలలో చేర్పించి, చదువు చెప్పించే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. ఆ కుటుంబంలోని అంకోజి, సుమ కుమారుడుకి వ్యవసాయ రంగంలో డ్రోన్ శిక్షణ ఇప్పించి, ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. వీరికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని అక్కడికక్కడే జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.


More Telugu News