మహానాడులో పార్టీ వార్షిక నివేదికను ప్రవేశపెట్టిన కోశాధికారి
--
గత ఆర్థిక సంవత్సరంలో తెలుగుదేశం పార్టీకి సభ్యత్వం రూపంలో రూ.123.73 కోట్లు వచ్చాయని టీడీపీ కోశాధికారి మెంటె పార్థసారథి పేర్కొన్నారు. ఈ మేరకు మహానాడు వేదికపై ఆయన మాట్లాడుతూ.. మహానాడుకు విచ్చేసిన టీడీపీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. 2024 -2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టీడీపీ వార్షిక ఆర్థిక నివేదక వివరాలను సంక్షిప్తంగా వెల్లడించారు.
పార్టీకి వచ్చిన ఆదాయం..
ఖర్చులు..
పార్టీకి వచ్చిన ఆదాయం..
- సభ్యత్వ రుసుముల ద్వారా రూ. 123.19 కోట్లు,
- విరాళాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 82.5 కోట్లు
- వడ్డీపై ఆదాయం 23.5 కోట్లు
- అద్దె రూపంలో 2 లక్షలు
- మొత్తంగా రాబడి రూ.228.30 కోట్లు
ఖర్చులు..
- ప్రచారం కోసం వెచ్చించిన మొత్తం రూ. 31.73 కోట్లు
- ఆఫీసు అద్దె చెల్లింపు 14 లక్షలు
- ఆఫీసు ఖర్చులు 7.99 కోట్లు
- తరుగుదల 4.39 కోట్లు
- ఉద్యోగుల జీతాలు రూ.71 లక్షలు
- కార్యకర్తల సంక్షేమ బీమా రూ.15.84 కోట్లు
- ఇతర ఖర్చులు 53 లక్షలు
- 2025 వార్షిక సంవత్సరం కార్యకర్తల సంక్షేమానికి బీమా చెల్లింపు రూ. 48.9 కోట్లు
- మొత్తం ఖర్చు రూ. 61.33 కోట్లు
- మిగిలిన సొమ్ము రూ. 166.98 కోట్లు