మహానాడులో పార్టీ వార్షిక నివేదికను ప్రవేశపెట్టిన కోశాధికారి

--
గత ఆర్థిక సంవత్సరంలో తెలుగుదేశం పార్టీకి సభ్యత్వం రూపంలో రూ.123.73 కోట్లు వచ్చాయని టీడీపీ కోశాధికారి మెంటె పార్థసారథి పేర్కొన్నారు. ఈ మేరకు మహానాడు వేదికపై ఆయన మాట్లాడుతూ.. మహానాడుకు విచ్చేసిన టీడీపీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. 2024 -2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టీడీపీ వార్షిక ఆర్థిక నివేదక వివరాలను సంక్షిప్తంగా వెల్లడించారు. 

పార్టీకి వచ్చిన ఆదాయం..
  • సభ్యత్వ రుసుముల ద్వారా రూ. 123.19 కోట్లు,
  • విరాళాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 82.5 కోట్లు
  • వడ్డీపై ఆదాయం 23.5 కోట్లు
  • అద్దె రూపంలో 2 లక్షలు 
  • మొత్తంగా రాబడి రూ.228.30 కోట్లు

ఖర్చులు..
  • ప్రచారం కోసం వెచ్చించిన మొత్తం రూ. 31.73 కోట్లు
  • ఆఫీసు అద్దె చెల్లింపు 14 లక్షలు
  • ఆఫీసు ఖర్చులు 7.99 కోట్లు
  • తరుగుదల 4.39 కోట్లు
  • ఉద్యోగుల జీతాలు రూ.71 లక్షలు
  • కార్యకర్తల సంక్షేమ బీమా రూ.15.84 కోట్లు
  • ఇతర ఖర్చులు 53 లక్షలు
  • 2025 వార్షిక సంవత్సరం కార్యకర్తల సంక్షేమానికి బీమా చెల్లింపు రూ. 48.9 కోట్లు
  • మొత్తం ఖర్చు రూ. 61.33 కోట్లు
  • మిగిలిన సొమ్ము రూ. 166.98 కోట్లు
31.03.2025 కు పార్టీ జనరల్ ఫండ్ విలువు రూ. 469.42 కోట్లు


More Telugu News