ఆసక్తికరంగా జాన్వీ కపూర్ ‘పరమ్ సుందరి’ ఫస్ట్ లుక్ టీజర్
- జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా ‘పరమ్ సుందరి’
- రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కించిన తుషార్ జలోటా
- జులై 25న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా
జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘పరమ్ సుందరి’. తాజాగా మేకర్స్ ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ను రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే ఈ చిత్రం ‘పరం’ (సిద్ధార్థ్ మల్హోత్రా), ‘సుందరి’ (జాన్వీ కపూర్) మధ్య ప్రేమకథగా సాగనుందని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య సాంస్కృతిక భేదాలు, హాస్యభరితమైన సన్నివేశాలు సినిమాకు హైలైట్గా నిలవనున్నాయి.
ఈ టీజర్లో కేరళలోని అందమైన బ్యాక్వాటర్స్, హౌస్బోట్ల నేపథ్యం అద్భుతంగా ఉంది. సిద్ధార్థ్, జాన్వీ ఒక బైక్పై రొమాన్స్ చేస్తూ కనిపించారు. బ్యాక్గ్రౌండ్లో సోను నిగమ్ ఆలపించిన మధురమైన పాట హైలైట్గా నిలిచింది. దినేశ్ విజన్ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రాజీవ్ ఖండేల్వాల్, ఆకాశ్ దహియా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘పరమ్ సుందరి’ చిత్రం జులై 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ టీజర్లో కేరళలోని అందమైన బ్యాక్వాటర్స్, హౌస్బోట్ల నేపథ్యం అద్భుతంగా ఉంది. సిద్ధార్థ్, జాన్వీ ఒక బైక్పై రొమాన్స్ చేస్తూ కనిపించారు. బ్యాక్గ్రౌండ్లో సోను నిగమ్ ఆలపించిన మధురమైన పాట హైలైట్గా నిలిచింది. దినేశ్ విజన్ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రాజీవ్ ఖండేల్వాల్, ఆకాశ్ దహియా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘పరమ్ సుందరి’ చిత్రం జులై 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.