ఏపీ మద్యం కేసు.. కీలక విచారణ వాయిదా

  • ఏపీ మద్యం కేసులో ఈ వారం జరగాల్సిన విచారణ వాయిదా
  • ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసిన విజ‌య‌వాడ కోర్టు
  • ఈడీ, ఏసీబీ వంటి దర్యాప్తు సంస్థల విచారణ మరింత వేగవంతం
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తున్న మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వారం జరగాల్సి ఉన్న కోర్టు విచారణ మరోసారి వాయిదా పడింది. బెయిల్ ఇవ్వాల‌ని నిందితులు దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌పై విజ‌య‌వాడ కోర్టులో విచార‌ణ జ‌రిగింది. 

ఇరువ‌ర్గాల వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం తదుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వంటి దర్యాప్తు సంస్థలు ఈ ప్రతిష్ఠాత్మక కేసులో తమ విచారణను ముమ్మరం చేసిన నేపథ్యంలో ఈ వాయిదా ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇక, ఈ కేసులో రాజ్ క‌సిరెడ్డితో పాటు మాజీ సీఎం వైఎస్ జగన్ మాజీ కార్యదర్శి కె. ధనుంజయ రెడ్డి, అలాగే పి. కృష్ణ మోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలు అరెస్టు అయి విజయవాడ జైలులో ఉన్న విష‌యం తెలిసిందే. 


More Telugu News