Velagapudi Ramakrishna Babu: చంద్రబాబుపై వైసీపీ నేతలు దౌర్జన్యం చేశారంటూ సీపీకి ఫిర్యాదు చేసిన వెలగపూడి రామకృష్ణబాబు

Velagapudi complains Vizag CP

  • ఇటీవల విశాఖలో చంద్రబాబును అడ్డుకున్న ఆందోళనకారులు
  • హైదరాబాద్ వెళ్లిపోయిన చంద్రబాబు
  • వైసీపీ నేతలు కుట్రపన్ని చంద్రబాబును అడ్డుకున్నారన్న వెలగపూడి

ఇటీవల చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లినప్పుడు విశాఖలో ఆందోళనకారులు ఆయన ప్రజాచైతన్యయాత్రకు అడ్డుపడ్డారు. దాంతో చంద్రబాబు హైదరాబాద్ వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో, టీడీపీ శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు వైసీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబుపై వైసీపీ నేతలు, కార్యకర్తలు దౌర్జన్యం చేశారని ఆయన విశాఖ సీపీ ఆర్కే మీనాకు తెలిపారు. వైసీపీ నేతలు కుట్రలు పన్ని చంద్రబాబును అడ్డుకున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News