KTR: ‘కరోనా’ రోగుల కోసం కింగ్ కోఠి ఆసుపత్రి సిద్ధం చేస్తున్నాం: మంత్రి కేటీఆర్

Minister Kcr says one more hpspital for corona patients

  • ఈ ఆసుపత్రి లో పూర్తి స్థాయి చికిత్స అందిస్తాం
  • అధునాతన సౌకర్యాలతో,  350 పడకల సామర్థ్యంతో సిద్ధం
  • హైదరాబాద్ లో మరో4ప్రత్యేక ఆసుపత్రులనూ  అందుబాటులోకి తెస్తాం

కరోనా వైరస్ బారిన పడ్డ వారికి హైదరాబాద్ లోని గాంధీ  ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే చికిత్స అందిస్తున్నారు. ‘కరోనా’ బాధితుల కోసం నగరంలోని మరో ప్రభుత్వ ఆసుపత్రి కూడా అందుబాటులోకి రానుంది. ఈ వైరస్ బారిన పడ్డ వారికి కింగ్ కోఠిలోని ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు సిద్ధం చేస్తున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘కరోనా’ బాధితులకు పూర్తి స్థాయిలో చికిత్స అందించేందుకే ఈ ఆసుపత్రి సిద్ధంగా ఉందని తెలిపారు. అధునాతన సౌకర్యాలతో ప్రత్యేకంగా 350 పడకల సామర్థ్యంతో ఈ ఆసుపత్రిని సిద్ధం చేశామని చెప్పారు. ‘కరోనా’ రోగులకు చికిత్స అందించేందుకు హైదరాబాద్ లో మరో నాలుగు ప్రత్యేక ఆసుపత్రులను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News