Dil Raju: పెళ్లయిన తర్వాత మొట్టమొదటిసారిగా తిరుమల వచ్చిన దిల్ రాజు దంపతులు

Dil Raju and wife visited Tirumala first time after wedding

  • మే 10న దిల్ రాజు, తేజస్విని వివాహం
  • లాక్ డౌన్ ఆంక్షల సడలింపుతో శ్రీవారి దర్శనానికి రాక
  • తిరుమలలో దిల్ రాజును గుర్తించిన అభిమానులు

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఇటీవల తేజస్విని అనే యువతిని పెళ్లాడారు. మే 10న వీరి వివాహం అతికొద్దిమంది నడుమ జరిగింది. ఆ సమయంలో లాక్ డౌన్ ఉండడంతో వారు ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం లాక్ డౌన్ ఆంక్షలు సడలించడంతో తొలిసారి తిరుమల వచ్చారు. పెళ్లయిన తర్వాత ఓ పబ్లిక్ ప్లేసులో వీరిద్దరూ కనిపించడం ఇదే ప్రథమం. శుక్రవారం ఉదయం స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయం వెలుపలికి రాగానే మీడియా కెమెరాలు క్లిక్ మన్నాయి. దిల్ రాజును గుర్తించిన అభిమానులు అక్కడికి పరుగులు తీశారు. ఈ సందర్భంగా తమ మాస్కులు తొలగించిన దిల్ రాజు, తేజస్విని ఫొటోలకు పోజులిచ్చారు.

  • Loading...

More Telugu News