Subramanian Swamy: విషం ఆనవాళ్లు తెలియకూడదనే సుశాంత్ మృతదేహానికి పోస్టుమార్టం ఆలస్యమయ్యేలా చేశారు: సుబ్రహ్మణ్యస్వామి

Subramanian Swamy made severe allegations on Sushant Singh Rajput issue

  • సుశాంత్ ది హత్యేనంటున్న స్వామి
  • విషప్రయోగం జరిగిందంటూ తాజా ట్వీట్
  • హంతకులను కఠినంగా శిక్షించాలని వ్యాఖ్యలు

సంచలన ఆరోపణలకు మారుపేరైన బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై దృష్టిసారించారు. సుశాంత్ ది హత్య అంటూ ఆరోపిస్తున్న సుబ్రహ్యణ్యస్వామి తాజాగా, సుశాంత్ పై విషప్రయోగం జరిగిందని, ఆ విషం ఆనవాళ్లు సుశాంత్ జీర్ణాశయంలో కనిపించకూడదన్న ఉద్దేశంతో కావాలనే పోస్టుమార్టం ప్రక్రియను ఆలస్యం చేశారని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించారు.

"హంతకుల దుష్టస్వభావం, వాళ్ల ఉద్దేశం క్రమేపీ బహిర్గతమవుతోంది. సుశాంత్ మృతదేహానికి పోస్టుమార్టం ప్రక్రియను కావాలనే ఆలస్యం చేశారు. సుశాంత్ కడుపులోని విషం జీర్ణ రసాల్లో కలిసిపోతే, అప్పుడు ఆ విషం ఆనవాళ్లు ఎవరూ గుర్తించలేరన్న ఆలోచనతోనే పోస్టుమార్టం ఆలస్యం అయ్యేలా చేశారు" అంటూ వివరించారు. దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాల్సిన సమయం వచ్చిందని సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు.

  • Loading...

More Telugu News