Mithun Reddy: కుప్పం ప్రజలను చంద్రబాబు దారుణంగా మోసం చేశారు: మిథున్‌ రెడ్డి

Chandrababu cheated Kuppam people says Mithun Reddy

  • బాబు పాలనలో కుప్పంలో కేవలం ఐదుగురు మాత్రమే బాగుపడ్డారు
  • కుప్పంలో కనీసం తాగునీరు కూడా అందించలేదు
  • జగన్ సుపరిపాలన చూసి ఓర్చుకోలేకపోతున్నారు

సొంత నియోజకవర్గం కుప్పం ప్రజలను టీడీపీ అధినేత చంద్రబాబు దారుణంగా మోసం చేశారని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. చంద్రబాబు పాలనలో కుప్పంలో బాగుపడింది కేవలం ఐదుగురు మాత్రమేనని... ఆ ఐదుగురే పెద్దపెద్ద బంగ్లాలు కట్టుకున్నారని అన్నారు. ప్రజలకు కనీసం తాగునీరు కూడా అందించలేదని విమర్శించారు. త్వరలోనే కుప్పంలో 10 వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కుప్పం ప్రజల ఆశీర్వాదాలు వైసీపీకి కావాలని కోరారు.
 
రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ సుపరిపాలన అందిస్తుంటే చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు. పేదలకు ఇళ్లు ఇస్తుంటే చంద్రబాబు అసహనానికి గురవుతున్నారని... కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారని దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News