Mahesh Babu: ఇటు త్రివిక్రమ్ .. అటు రాజమౌళి .. మధ్యలో మహేశ్!

Mahesh Babu and Rajamoui project update
  • ముగింపు దశలో 'సర్కారువారి పాట'
  • మహేశ్ సర్జరీ తరువాతే మిగతా షూటింగ్
  • మరోపక్క త్రివిక్రమ్ సినిమాకు సన్నాహాలు
  • లైన్లో రాజమౌళి ప్రాజెక్టు    
మహేశ్ బాబు తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'సర్కారువారి పాట' రెడీ అవుతోంది. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. మోకాలు సర్జరీ కారణంగా కొంత గ్యాప్ తరువాత మహేశ్ ఈ సినిమా చేయనున్నాడు. ఆ తరువాత ఆయన త్రివిక్రమ్ సినిమా చేయవలసి ఉంది.

అయితే సర్జరీ .. ఆ తరువాత విశ్రాంతి .. ఆ తరువాత  'సర్కారువారి పాట' బ్యాలెన్స్ ను మహేశ్ బాబు పూర్తి చేయవలసి ఉంటుంది. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తో చేసి, అది పూర్తయిన తరువాతనే రాజమౌళి ప్రాజెక్టుపైకి వెళ్లాలంటే అందుకు చాలా సమయం పడుతుంది. అందువలన మహేశ్ నేరుగా రాజమౌళి సినిమాపైకి వెళ్లనున్నాడనే ఒక ప్రచారం జరుగుతోంది.

ఈ కారణంగా త్రివిక్రమ్ తో సినిమా ఇప్పట్లో లేనట్టేనని చెప్పుకుంటున్నారు. కానీ మహేశ్ ఎప్పుడూ ఏ సినిమాకి కూడా లుక్ పరంగా తన హెయిర్ స్టైల్ మినహా పెద్దగా మార్పులు చేయడానికి ఒప్పుకోడు. అందువలన ఒకే సమయంలో రెండు సినిమాలు చేయడానికి ఆయనకి ఇబ్బంది ఉండదు. పైగా ఇటు త్రివిక్రమ్ .. అటు రాజమౌళి ఇద్దరూ కూడా కూల్ గా పనులు చక్కబెట్టేవారే గనుక, మహేశ్ ఈ ఇద్దరితోను సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయనేది మరికొందరి మాట.  
Mahesh Babu
Trivikram Srinivas
Rajamouli

More Telugu News