Karthi: శింబు జోడీగా దర్శకుడు శంకర్ తనయ!

Adithi Shankar in Simbu Movie

  • మెడిసిన్ పూర్తి చేసిన శంకర్ కూతురు
  • సినిమాల పట్ల ఆసక్తితో ప్రయత్నాలు
  • కార్తి జోడీగా కోలీవుడ్ కి పరిచయం
  • లైన్లో శింబు 'కరోనా కుమార్'  

తమిళ దర్శకుడు శంకర్ కూతురు అదితి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మెడిసిన్ పూర్తి చేసిన ఈ అమ్మాయి, కార్తి కథానాయకుడిగా చేస్తున్న 'విరుమాన్' సినిమాతో తమిళ తెరకి పరిచయమవుతోంది. ఈ సినిమాకి నిర్మాత సూర్య కావడం విశేషం. ఒక కీలకమైన పాత్రలో ప్రకాశ్ రాజ్ కనిపించనున్నాడు.

ఈ సినిమా సెట్స్ పై ఉండగానే అదితి మరో ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 'కరోనా కుమార్' అనే టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమాలో ఆమె శింబు జోడీగా సందడి చేయనుంది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి గోకుల్ దర్శకత్వం వహించనున్నాడు.
 
ప్రస్తుతం శింబు .. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగు పూర్తి కాగానే 'కరోనా కుమార్' సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా చెబుతున్నారు. అదితి మాత్రం వరుస సినిమాలను ఒప్పేసుకుంటూ వెళ్లాలనే పట్టుదలతో ఉందని అంటున్నారు. మరి శంకర్ కూతురు టాలీవుడ్ కి కూడా తన టాలెంట్ చూపిస్తుందేమో చూడాలి.

  • Loading...

More Telugu News