Balineni Srinivasa Reddy: అర్ధాంగికి కరోనా రావడంతో ఐసోలేషన్ లో మంత్రి బాలినేని

AP Minister Balineni in isolation after his wife tested corona positive

  • వేగంగా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారి
  • బాలినేని ఇంట్లో కరోనా కలకలం
  • గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు కూడా కరోనా

ఏపీలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో కరోనా కలకలం రేగింది. ఆయన భార్య శచీదేవికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలో అర్ధాంగితో పాటు మంత్రి బాలినేని కూడా హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు.

అటు, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి కూడా కరోనా బారినపడ్డారు. ఈ క్రమంలో నేతలు స్పందిస్తూ, తమను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News